వెబ్ సిరీస్ల విషయంలో మన స్టార్ హీరోలు, దర్శకులకు చిన్న చూపు ఉన్నట్లే అనిపిస్తోంది వాళ్ల వ్యవహారం చూస్తుంటే. మన దగ్గర ఫామ్లో ఉన్న, పేరున్న నటీనటులు.. టెక్నీషియన్లు పెద్దగా వెబ్ సిరీస్ల వైపు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీలో పేరున్న నటీనటులు, దర్శకులు వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇక హాలీవుడ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ తెలుగులో మాత్రం క్రిష్ జాగర్లమూడి, సత్యదేవ్ లాంటి వాళ్లు తప్పితే పేరున్న వాళ్లు ఇటు వైపు చూడట్లేదు.
ఐతే అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ ఒరవడి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఓ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయొచ్చని అంటున్నారు. అది ఆయన కొత్త సినిమా ‘పుష్ప’కు రిలేటెడ్గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కథ తయారీలో భాగంగా సుకుమార్ అండ్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎంతగానో పరిశోధించింది.
లెక్కలేనంత సమాచారం రాబట్టింది. ఎన్నో ఉపకథలు తయారు చేసింది. అందులోంచి సినిమాకు తీసుకున్న కంటెంట్ తక్కువే. మిగతా సమాచారంతో వెబ్ సిరీస్ చేద్దామన్న ఆలోచన ఇంతకముందే వచ్చింది.
తర్వాత ‘పుష్ప’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడిచింది. దీనిపై సుకుమార్ పరిపరి విధాల ఆలోచించారని.. చివరికిప్పుడు వెబ్ సిరీస్కే ఓటేశారని సన్నిహితుల సమాచారం.
అమేజాన్ ప్రైం వాళ్లతో దీనిపై డిస్కషన్లు నడుస్తున్నాయట. రామ్ చరణ్ బందువొకరు అమేజాన్ సంస్థలో కీలక బాధ్యతలు పోషిస్తున్నారని.. ఆయన వాళ్లతో మాట్లాడి బడ్జెట్, ఇతర వ్యవహారాల్ని ఫైనలైజ్ చేస్తున్నారని.. చరణ్ కూడా భాగస్వామిగా మారి ఈ వెబ్ సిరీస్ను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని.. సుకుమార్ డైరెక్ట్ చేయడం లేదా తన అసిస్టెంటును పెట్టి సూపర్ వైజ్ చేయడం.. రెంటిలో ఏదో ఒకటి జరగొచ్చని.. పుష్ప పట్టాలెక్కిన తర్వాత దీనిపై స్పష్ట రావచ్చని అంటున్నారు.
This post was last modified on May 2, 2020 12:36 am
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…