Movie News

చరణ్ సపోర్ట్‌తో సుకుమార్ వెబ్ సిరీస్?

వెబ్ సిరీస్‌ల విషయంలో మన స్టార్ హీరోలు, దర్శకులకు చిన్న చూపు ఉన్నట్లే అనిపిస్తోంది వాళ్ల వ్యవహారం చూస్తుంటే. మన దగ్గర ఫామ్‌లో ఉన్న, పేరున్న నటీనటులు.. టెక్నీషియన్లు పెద్దగా వెబ్ సిరీస్‌ల వైపు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీలో పేరున్న నటీనటులు, దర్శకులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఇక హాలీవుడ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ తెలుగులో మాత్రం క్రిష్ జాగర్లమూడి, సత్యదేవ్ లాంటి వాళ్లు తప్పితే పేరున్న వాళ్లు ఇటు వైపు చూడట్లేదు.

ఐతే అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ ఒరవడి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయొచ్చని అంటున్నారు. అది ఆయన కొత్త సినిమా ‘పుష్ప’కు రిలేటెడ్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కథ తయారీలో భాగంగా సుకుమార్ అండ్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎంతగానో పరిశోధించింది.

లెక్కలేనంత సమాచారం రాబట్టింది. ఎన్నో ఉపకథలు తయారు చేసింది. అందులోంచి సినిమాకు తీసుకున్న కంటెంట్ తక్కువే. మిగతా సమాచారంతో వెబ్ సిరీస్ చేద్దామన్న ఆలోచన ఇంతకముందే వచ్చింది.

తర్వాత ‘పుష్ప’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడిచింది. దీనిపై సుకుమార్ పరిపరి విధాల ఆలోచించారని.. చివరికిప్పుడు వెబ్ సిరీస్‌కే ఓటేశారని సన్నిహితుల సమాచారం.

అమేజాన్ ప్రైం వాళ్లతో దీనిపై డిస్కషన్లు నడుస్తున్నాయట. రామ్ చరణ్ బందువొకరు అమేజాన్ సంస్థలో కీలక బాధ్యతలు పోషిస్తున్నారని.. ఆయన వాళ్లతో మాట్లాడి బడ్జెట్, ఇతర వ్యవహారాల్ని ఫైనలైజ్ చేస్తున్నారని.. చరణ్ కూడా భాగస్వామిగా మారి ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని.. సుకుమార్ డైరెక్ట్ చేయడం లేదా తన అసిస్టెంటును పెట్టి సూపర్ వైజ్ చేయడం.. రెంటిలో ఏదో ఒకటి జరగొచ్చని.. పుష్ప పట్టాలెక్కిన తర్వాత దీనిపై స్పష్ట రావచ్చని అంటున్నారు.

This post was last modified on May 2, 2020 12:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago