విడుదలకు ముందు ప్రతి ఒక్కరూ తమ సినిమా గురించి గొప్పగా మాట్లాడేవాళ్లే. ఐతే ఆ మాటలకు, సినిమాలో ఉన్న కంటెంట్కు అన్నిసార్లూ పొంతన కుదరదు. అంచనాల కంటే తక్కువ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రం కిష్కింధపురి మీద ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ చూపించాడు. రాక్షసుడు ను మించిన సినిమా అని.. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని.. కిష్కింధపురి-2 కోసం ప్రేక్షకులు అడుగుతారని విడుదలకు ముందు అతను వ్యాఖ్యానించాడు. నిర్మాత కూడా ఎంతో నమ్మకంగా పెయిడ్ ప్రిమియర్స్ కూడా పెద్ద సంఖ్యలో వేశారు. అప్పుడు టాక్ బాగానే వచ్చింది.
ఐతే తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన రివ్యూలు మాత్రం రాలేదు. చాలా వరకు యావరేజ్ రివ్యూలు, రేటింగ్లతో సరిపెట్టారు క్రిటిక్స్. టాక్ కూడా కొంచెం మిక్స్డ్ గా వచ్చింది. దీనికి తోడు పోటీగా వచ్చిన మిరాయ్కి అదిరిపోయే రివ్యూలు, టాక్ రావడంతో తొలి రోజు కిష్కింధపురి పెద్దగా డిస్కషన్లలో లేదు.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర కిష్కింధపురి ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలిగాయి. కానీ రివ్యూలను, డివైడ్ టాక్ను జయిస్తూ ఈ సినిమా రెండో రోజు మంచి ఆక్యుపెన్సీలతో రన్ అయింది. హైదరాబాద్ సహా పెద్ద సిటీల్లో పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పడ్డాయి. బి, సి సెంటర్లలో బెల్లంకొండ శ్రీనివాస్కు ఉన్న ఫాలోయింగ్ సినిమాకు ప్లస్ అయింది. మిరాయ్ పోటీని తట్టుకుని ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఆదివారం కూడా సినిమా అంచనాలను మించి పెర్ఫామ్ చేసింది.
వీకెండ్లో కిష్కింధపురికి రూ.12కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గినా.. డ్రాప్ మరీ ఎక్కువ అయితే లేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్గా నిలబడిందనడంలో సందేహం లేదు. ఈ సినిమాను రూ.32 కోట్ల బడ్జెట్లో రూపొందించారు. బెల్లంకొండ శ్రీనివాస్కు హిందీలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా డిజిటల రైట్స్ రూపంలోనే 80 శాతం మేర పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. థియేట్రికల్ హక్కులను రూ.10 కోట్ల లోపే అమ్మారు. సినిమా బ్రేక్ ఈవెన్ కావడం, లాభాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కిష్కింధపురిపై బెల్లంకొండ పెట్టుకున్న నమ్మకం నిలబడిందనే చెప్పాలి.
This post was last modified on September 15, 2025 10:29 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…