థియేటర్లు తెరుచుకోమని పర్మిషన్ ఏనాడో వచ్చేసినా కానీ థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలు ఇంకా ఓటిటి ప్లాట్ఫామ్లనే నమ్ముకుంటున్నారు. బడా హీరోల సినిమాలు కూడా విడుదల కాకుండా వాయిదా పడుతూనే వున్నాయి. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప పరిస్థితిని అంచనా వేయలేమని భావిస్తోంటే ముందుగా ఆ ధైర్యం చేసే వాళ్లే ఎవరూ కనిపించడం లేదు. హీరోలే వెనకాడుతోన్న టైమ్లో హీరోయిన్ ప్రధాన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ చిత్రాన్ని డిసెంబరు 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
విశేషం ఏమిటంటే అదే రోజున అమెజాన్లో దుర్గామతి అనే మరో హీరోయిన్ ప్రధాన సినిమా విడుదలవుతోంది. తెలుగులో అనుష్క నటించిన భాగమతికి రీమేక్ అయిన ఈ చిత్రంలో భూమి పేడ్నేకర్ హీరోయిన్గా నటించింది. మరి కియారా చిత్రం చూడ్డానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో తరలి వస్తారనేది తెలియదు. యాభై శాతం సీట్లు అమ్మకంతో బిజినెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ చిత్రం కొంతవరకు ఉపకరిస్తుంది.
This post was last modified on November 24, 2020 8:00 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…