థియేటర్లు తెరుచుకోమని పర్మిషన్ ఏనాడో వచ్చేసినా కానీ థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలు ఇంకా ఓటిటి ప్లాట్ఫామ్లనే నమ్ముకుంటున్నారు. బడా హీరోల సినిమాలు కూడా విడుదల కాకుండా వాయిదా పడుతూనే వున్నాయి. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప పరిస్థితిని అంచనా వేయలేమని భావిస్తోంటే ముందుగా ఆ ధైర్యం చేసే వాళ్లే ఎవరూ కనిపించడం లేదు. హీరోలే వెనకాడుతోన్న టైమ్లో హీరోయిన్ ప్రధాన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ చిత్రాన్ని డిసెంబరు 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
విశేషం ఏమిటంటే అదే రోజున అమెజాన్లో దుర్గామతి అనే మరో హీరోయిన్ ప్రధాన సినిమా విడుదలవుతోంది. తెలుగులో అనుష్క నటించిన భాగమతికి రీమేక్ అయిన ఈ చిత్రంలో భూమి పేడ్నేకర్ హీరోయిన్గా నటించింది. మరి కియారా చిత్రం చూడ్డానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో తరలి వస్తారనేది తెలియదు. యాభై శాతం సీట్లు అమ్మకంతో బిజినెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ చిత్రం కొంతవరకు ఉపకరిస్తుంది.
This post was last modified on November 24, 2020 8:00 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…