గత నెలలో విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిన్న సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు రావడం లేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో అందరినీ కదిలించేసింది. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా.. జనం వచ్చి థియేటర్లలో సినిమా చూడట్లేదని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అంతే కాక ఈ సినిమా బాలేదని అంటే చెప్పుతో కొట్టుకుంటా అని తాను విడుదలకు ముందు ఛాలెంజ్ చేశానని.. ఆ ప్రకారమే చేస్తున్నానంటూ నిజంగానే చెప్పుతో కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఐతే ఈ వీడియో వైరల్ అయ్యాక తాను చేసింది తప్పు అంటూ ఆ దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతంపై ‘బార్బరిక్’ ప్రెజెంటర్ అయిన స్టార్ డైరెక్టర్ మారుతి స్పందించాడు.
‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి సినిమా అయినా.. అది జనాలకు రీచ్ కాకపోవడానికి టైటిల్ ఒక కారణమని మారుతి అభిప్రాయపడ్డాడు. ‘బార్బరిక్’ అనేే టైటిల్ ఏదో ‘బార్బిక్యూ’లా ఉందని.. ఆ టైటిల్ వద్దని తాను మోహన్కు వందసార్లు చెప్పానని మారుతి తెలిపాడు. ఈ టైటిల్ వద్దంటూ రోజుకో పేరు సూచిస్తూ వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాడినన్నాడు మారుతి. జస్ట్ టైటిల్ చూస్తే మనసు మారదేమో అని.. వాటిని డిజైన్ చేసి కూడా పంపేవాడినన్నాడు. ఐతే ఆ దర్శకుడు మాత్రం ‘బార్బరిక్’ అంటే దేవుడు.. దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని ఒక ట్రాన్స్లో ఉండిపోయాడని.. ఎంత చెప్పినా వినలేదని మారుతి తెలిపాడు.
ఒక దర్శకుడిగా తాను మరో దర్శకుడిని ఫోర్స్ చేయకూడదని ఒక దశ దాటాక వదిలేశానని.. కానీ ఆ సినిమా జనాలకు రీచ్ కాకుండానే వెళ్లిపోయిందని మారుతి అన్నాడు. మోహన్ మంచి దర్శకుడని, అతను మంచి సినిమానే తీశాడని.. కానీ ఆ సినిమా టైటిల్ సహా కొన్ని కారణాలతో జనాల్లోకి వెళ్లలేదని మారుతి అభిప్రాయపడ్డాడు.
This post was last modified on September 14, 2025 4:33 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…