గత నెలలో విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిన్న సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు రావడం లేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో అందరినీ కదిలించేసింది. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా.. జనం వచ్చి థియేటర్లలో సినిమా చూడట్లేదని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అంతే కాక ఈ సినిమా బాలేదని అంటే చెప్పుతో కొట్టుకుంటా అని తాను విడుదలకు ముందు ఛాలెంజ్ చేశానని.. ఆ ప్రకారమే చేస్తున్నానంటూ నిజంగానే చెప్పుతో కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఐతే ఈ వీడియో వైరల్ అయ్యాక తాను చేసింది తప్పు అంటూ ఆ దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతంపై ‘బార్బరిక్’ ప్రెజెంటర్ అయిన స్టార్ డైరెక్టర్ మారుతి స్పందించాడు.
‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి సినిమా అయినా.. అది జనాలకు రీచ్ కాకపోవడానికి టైటిల్ ఒక కారణమని మారుతి అభిప్రాయపడ్డాడు. ‘బార్బరిక్’ అనేే టైటిల్ ఏదో ‘బార్బిక్యూ’లా ఉందని.. ఆ టైటిల్ వద్దని తాను మోహన్కు వందసార్లు చెప్పానని మారుతి తెలిపాడు. ఈ టైటిల్ వద్దంటూ రోజుకో పేరు సూచిస్తూ వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాడినన్నాడు మారుతి. జస్ట్ టైటిల్ చూస్తే మనసు మారదేమో అని.. వాటిని డిజైన్ చేసి కూడా పంపేవాడినన్నాడు. ఐతే ఆ దర్శకుడు మాత్రం ‘బార్బరిక్’ అంటే దేవుడు.. దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని ఒక ట్రాన్స్లో ఉండిపోయాడని.. ఎంత చెప్పినా వినలేదని మారుతి తెలిపాడు.
ఒక దర్శకుడిగా తాను మరో దర్శకుడిని ఫోర్స్ చేయకూడదని ఒక దశ దాటాక వదిలేశానని.. కానీ ఆ సినిమా జనాలకు రీచ్ కాకుండానే వెళ్లిపోయిందని మారుతి అన్నాడు. మోహన్ మంచి దర్శకుడని, అతను మంచి సినిమానే తీశాడని.. కానీ ఆ సినిమా టైటిల్ సహా కొన్ని కారణాలతో జనాల్లోకి వెళ్లలేదని మారుతి అభిప్రాయపడ్డాడు.
This post was last modified on September 14, 2025 4:33 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…