గత నెలలో విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిన్న సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు రావడం లేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో అందరినీ కదిలించేసింది. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా.. జనం వచ్చి థియేటర్లలో సినిమా చూడట్లేదని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అంతే కాక ఈ సినిమా బాలేదని అంటే చెప్పుతో కొట్టుకుంటా అని తాను విడుదలకు ముందు ఛాలెంజ్ చేశానని.. ఆ ప్రకారమే చేస్తున్నానంటూ నిజంగానే చెప్పుతో కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఐతే ఈ వీడియో వైరల్ అయ్యాక తాను చేసింది తప్పు అంటూ ఆ దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతంపై ‘బార్బరిక్’ ప్రెజెంటర్ అయిన స్టార్ డైరెక్టర్ మారుతి స్పందించాడు.
‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి సినిమా అయినా.. అది జనాలకు రీచ్ కాకపోవడానికి టైటిల్ ఒక కారణమని మారుతి అభిప్రాయపడ్డాడు. ‘బార్బరిక్’ అనేే టైటిల్ ఏదో ‘బార్బిక్యూ’లా ఉందని.. ఆ టైటిల్ వద్దని తాను మోహన్కు వందసార్లు చెప్పానని మారుతి తెలిపాడు. ఈ టైటిల్ వద్దంటూ రోజుకో పేరు సూచిస్తూ వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాడినన్నాడు మారుతి. జస్ట్ టైటిల్ చూస్తే మనసు మారదేమో అని.. వాటిని డిజైన్ చేసి కూడా పంపేవాడినన్నాడు. ఐతే ఆ దర్శకుడు మాత్రం ‘బార్బరిక్’ అంటే దేవుడు.. దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని ఒక ట్రాన్స్లో ఉండిపోయాడని.. ఎంత చెప్పినా వినలేదని మారుతి తెలిపాడు.
ఒక దర్శకుడిగా తాను మరో దర్శకుడిని ఫోర్స్ చేయకూడదని ఒక దశ దాటాక వదిలేశానని.. కానీ ఆ సినిమా జనాలకు రీచ్ కాకుండానే వెళ్లిపోయిందని మారుతి అన్నాడు. మోహన్ మంచి దర్శకుడని, అతను మంచి సినిమానే తీశాడని.. కానీ ఆ సినిమా టైటిల్ సహా కొన్ని కారణాలతో జనాల్లోకి వెళ్లలేదని మారుతి అభిప్రాయపడ్డాడు.
This post was last modified on September 14, 2025 4:33 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…