ఒకప్పుడు ఆర్టిస్టులకు పారితోషకాలు ఇవ్వడం.. వారికి వసతి, తిండి లాంటి అవసరాలు తీర్చడం వరకే నిర్మాతల బాధ్యతగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. హీరో హీరోయిన్లు, పెద్ద ఆర్టిస్టులకు భారీ పారితోషకాలు ఇస్తూ.. అవి చాలవన్నట్లు వారి స్టాఫ్ను మెయింటైన్ చేయడం, కారవాన్లకు బిల్లులు చెల్లించడం, ఇలా అదనపు ఖర్చులు నిర్మాతల మీద పడుతున్నాయి. స్టాఫ్ అంటే ఒకరిద్దరు కూడా కాదు. డ్రైవర్లు, అసిస్టెంట్లు, బౌన్సర్లు.. ఇలా చాలామందికి నిర్మాతలు రోజు వారీ బిల్లులు చెల్లించక తప్పని పరిస్థితి. వీళ్లందరికీ ఫ్లైట్ టికెట్లు, వసతి కూడా వారి బాధ్యతగానే ఉంటోంది. సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడానికి ఇది ఓ ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు.
మేకింగ్ మీద పెట్టే బడ్జెట్ తగ్గిపోయి ఈ రకమైన ఖర్చులకే చాలా వరకు డబ్బు పెట్టాల్సి రావడంతో నిర్మాతలు సతమతం అయిపోతున్నారు. ఈ పరిణామంపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘స్టార్లు తమ నటనతో గుర్తింపు సంపాదించాలి. కానీ నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు. నాకు ఒక విషయం అస్సలు అంతుబట్టట్లేదు. ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఎవ్వరూ తమ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వరట. వారికి నిర్మాతలే పేమెంట్లు చేయాలట. ఒక నటుడి స్పాట్ బాయ్కి కూడా నిర్మాతే డబ్బులు చెల్లిస్తున్నాడు. ఇది అంతటితో ఆగిపోవట్లేదు.
నటుల ట్రైనర్లు, వంట వాళ్లు, ఇతర సిబ్బందికి కూడా నిర్మాతలే డబ్బులిస్తున్నాడు. కొందరు ఆర్టిస్టులు సెట్లో లైవ్ కిచెన్ పెట్టుకుంటున్నారు. దానికయ్యే ఖర్చు మొత్తం నిర్మాతే చెల్లించాలి. ఒక ఆర్టిస్టు తనతో పాటు స్టాఫ్ కోసం ఒకటికి మించి వానిటీ వాన్లు డిమాండ్ చేస్తున్నాడు. ఒక నిర్మాత సినిమాకు ఏం అవసరమో దానికి మాత్రమే ఖర్చు చేయాలి. మేకప్, హేర్ స్టైలింగ్, కాస్ట్యూమ్ వంటి వాటికి డబ్బులు పెట్టడంలో అర్థముంది. కానీ నటుల వ్యక్తిగత స్టాఫ్కు అతనెందుకు డబ్బులివ్వాలి. వాళ్లు సినిమాకు ఏ రకంగా సాయపడతారు. కోట్ల రూపాయల పారితోషకాలు తీసుకుంటున్న ఆర్టిస్టులు తమ స్టాఫ్కు డబ్బులివ్వలేరా. నేనైతే తొలి రోజు నుంచి నా డ్రైవర్ సహా పర్సనల్ స్టాఫ్ ఎవ్వరికీ నిర్మాతల డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు.
This post was last modified on September 14, 2025 1:44 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…