Movie News

చిరు – బాబీ మూవీకి మిరాయ్ కెమెరా ?

బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న మిరాయ్ తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. గత ఏడాది రవితేజ ఈగల్ తో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ తన మీద నమ్మకంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు. డైరెక్టర్ గా తన డెబ్యూ సూర్య వర్సెస్ సూర్య అనే విషయం సగటు ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు. దాని తర్వాత ఎక్కువగా కెమెరామెన్ గా ఫోకస్ చేయడంతో ప్రేమమ్, చిత్రలహరి, ధమాకా, కార్తికేయ 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో తన కెమెరాతో భాగం అయ్యాడు. ఇప్పుడు ఛాయాగ్రాహకుడిగా మరో క్రేజీ ప్రాజెక్టు దక్కనుందట.

వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య చిరు పుట్టినరోజుకి కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి వదిలారు. అక్టోబర్ 2 నుంచి ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి కెమరామెన్ గా కార్తీక్ ఘట్టమనేనిని దాదాపుగా లాక్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకా కథ వినలేదని, చిరంజీవితో చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ చెప్పడం చూస్తే బాబీ ఈ కలయికని సాధ్యం చేసేలానే ఉన్నాడు. మిరాయ్ విజయానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం బహుశా దానికి సంకేతం అనుకోవచ్చు. ఇంకో వారంలో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.

మిరాయ్ 2కి ఇంకా టైం పట్టేలా ఉంది. పీపుల్స్ మీడియాలోనే జాంబీ రెడ్డి 2 చేస్తున్న తేజ సజ్జ అదయ్యాక 2027లో మిరాయ్ రెండో భాగంలో జాయిన్ కావొచ్చు. అప్పటిదాకా కార్తీక్ ఘట్టమేనేని స్క్రిప్ట్ తో పాటు చిరు బాబీ మూవీని కూడా పూర్తి చేసేయొచ్చు. ఒక ఛాయాగ్రాహకుడు ప్యాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా ఇంత పెద్ద విజయం సాధించడం అరుదు. గతంలో కొందరు ఈ ప్రయత్నాలు చేశారు కానీ బ్లాక్ బస్టర్ దక్కిన వాళ్ళు తక్కువ. కార్తీక్ ఈ విషయంలో ఘనత సాధించాడు. మిరాయ్ సీక్వెల్ కాకుండా మరో సినిమా కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తోనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

1 hour ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago