బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న మిరాయ్ తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. గత ఏడాది రవితేజ ఈగల్ తో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ తన మీద నమ్మకంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు. డైరెక్టర్ గా తన డెబ్యూ సూర్య వర్సెస్ సూర్య అనే విషయం సగటు ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు. దాని తర్వాత ఎక్కువగా కెమెరామెన్ గా ఫోకస్ చేయడంతో ప్రేమమ్, చిత్రలహరి, ధమాకా, కార్తికేయ 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో తన కెమెరాతో భాగం అయ్యాడు. ఇప్పుడు ఛాయాగ్రాహకుడిగా మరో క్రేజీ ప్రాజెక్టు దక్కనుందట.
వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య చిరు పుట్టినరోజుకి కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి వదిలారు. అక్టోబర్ 2 నుంచి ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి కెమరామెన్ గా కార్తీక్ ఘట్టమనేనిని దాదాపుగా లాక్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకా కథ వినలేదని, చిరంజీవితో చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ చెప్పడం చూస్తే బాబీ ఈ కలయికని సాధ్యం చేసేలానే ఉన్నాడు. మిరాయ్ విజయానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం బహుశా దానికి సంకేతం అనుకోవచ్చు. ఇంకో వారంలో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
మిరాయ్ 2కి ఇంకా టైం పట్టేలా ఉంది. పీపుల్స్ మీడియాలోనే జాంబీ రెడ్డి 2 చేస్తున్న తేజ సజ్జ అదయ్యాక 2027లో మిరాయ్ రెండో భాగంలో జాయిన్ కావొచ్చు. అప్పటిదాకా కార్తీక్ ఘట్టమేనేని స్క్రిప్ట్ తో పాటు చిరు బాబీ మూవీని కూడా పూర్తి చేసేయొచ్చు. ఒక ఛాయాగ్రాహకుడు ప్యాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా ఇంత పెద్ద విజయం సాధించడం అరుదు. గతంలో కొందరు ఈ ప్రయత్నాలు చేశారు కానీ బ్లాక్ బస్టర్ దక్కిన వాళ్ళు తక్కువ. కార్తీక్ ఈ విషయంలో ఘనత సాధించాడు. మిరాయ్ సీక్వెల్ కాకుండా మరో సినిమా కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తోనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on September 14, 2025 12:19 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…