Movie News

చిరు – బాబీ మూవీకి మిరాయ్ కెమెరా ?

బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న మిరాయ్ తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. గత ఏడాది రవితేజ ఈగల్ తో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ తన మీద నమ్మకంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు. డైరెక్టర్ గా తన డెబ్యూ సూర్య వర్సెస్ సూర్య అనే విషయం సగటు ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు. దాని తర్వాత ఎక్కువగా కెమెరామెన్ గా ఫోకస్ చేయడంతో ప్రేమమ్, చిత్రలహరి, ధమాకా, కార్తికేయ 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో తన కెమెరాతో భాగం అయ్యాడు. ఇప్పుడు ఛాయాగ్రాహకుడిగా మరో క్రేజీ ప్రాజెక్టు దక్కనుందట.

వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య చిరు పుట్టినరోజుకి కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి వదిలారు. అక్టోబర్ 2 నుంచి ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి కెమరామెన్ గా కార్తీక్ ఘట్టమనేనిని దాదాపుగా లాక్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకా కథ వినలేదని, చిరంజీవితో చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ చెప్పడం చూస్తే బాబీ ఈ కలయికని సాధ్యం చేసేలానే ఉన్నాడు. మిరాయ్ విజయానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం బహుశా దానికి సంకేతం అనుకోవచ్చు. ఇంకో వారంలో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.

మిరాయ్ 2కి ఇంకా టైం పట్టేలా ఉంది. పీపుల్స్ మీడియాలోనే జాంబీ రెడ్డి 2 చేస్తున్న తేజ సజ్జ అదయ్యాక 2027లో మిరాయ్ రెండో భాగంలో జాయిన్ కావొచ్చు. అప్పటిదాకా కార్తీక్ ఘట్టమేనేని స్క్రిప్ట్ తో పాటు చిరు బాబీ మూవీని కూడా పూర్తి చేసేయొచ్చు. ఒక ఛాయాగ్రాహకుడు ప్యాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా ఇంత పెద్ద విజయం సాధించడం అరుదు. గతంలో కొందరు ఈ ప్రయత్నాలు చేశారు కానీ బ్లాక్ బస్టర్ దక్కిన వాళ్ళు తక్కువ. కార్తీక్ ఈ విషయంలో ఘనత సాధించాడు. మిరాయ్ సీక్వెల్ కాకుండా మరో సినిమా కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తోనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

This post was last modified on September 14, 2025 12:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago