టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా వచ్చినా అయితే తమన్.. లేదంటే దేవిశ్రీ ప్రసాద్.. కాదంటే అనిరుధ్ రవిచందర్.. ఈ ముగ్గురిలో ఒకరు సంగీత దర్శకులుగా ఉంటారు. కీరవాణి రాజమౌళి సినిమాలను దాటి పని చేసే చిత్రాలు చాలా తక్కువ. మిడ్ రేంజ్ సినిమాలు తీసే వాళ్లు కూడా కొన్నేళ్ల నుంచి పై ముగ్గురి వైపే చూస్తున్నారు. తెలుగులో ప్రతిభావంతులైన యువ సంగీత దర్శకులు ఉన్నప్పటికీ.. మిడ్ రేంజ్ చిత్రాలకు వారి వైపు చూడకుండా పరభాషా మ్యూజిక్ డైరెక్టర్లనే ఎక్కువ ఆశ్రయిస్తున్నారు మన ఫిలిం మేకర్స్. ఇలాంటి సమయంలో ఓ యువ సంగీత దర్శకుడు తన మ్యూజిక్లో ఉన్న పవరేంటో చాటి చెబుతూ.. ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నాడు. అతనే.. హరి గౌర.
ఇది మొన్నటిదాకా పెద్దగా పాపులర్ కాని పేరు. కానీ మిరాయ్ సినిమా రిలీజ్ తర్వాత హరి గౌర పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మిరాయ్ రివ్యూల్లో అందరూ ఎక్కువగా కొనియాడింది హరి సంగీతం గురించే. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అతను పెట్టిన ఎఫర్ట్, చూపించిన ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలో కీలకమైన ఘట్టాల్లో అతడి నేపథ్య సంగీతం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చింది. భారీ పక్షి అవతారంతో ముడిపడ్డ ఇంటర్వెల్ ఎపిసోడ్లో స్కోర్ అద్భుతం అనే చెప్పాలి. ద్వితీయార్ధమంతా ఒక హై ఇస్తూనే సాగింది ఆర్ఆర్. పతాక ఘట్టాల్లో థీమ్ మ్యూజిక్, స్కోర్ వేరే లెవెల్లో సాగాయి.
హరి గౌర పేరు ముందుగా వినిపించింది హనుమాన్ టైంలో. ఆ సినిమాకు మంచి పాటలు, అదిరిపోయే స్కోర్ అందించాడు. కానీ అంతకుముందు రెండు చిన్న సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. హనుమాన్ రూపంలో వచ్చిన గొప్ప అవకాశాన్ని అతను బాగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మిరాయ్తో అంతకుమించి అప్లాజ్ అందుకుంటున్నాడు. హనుమాన్ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా వద్దనుకుని రెండేళ్ల పాటు ఈ సినిమాకే అతను అంకితం అయ్యాడని.. ఈ సినిమాను అతనెంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో చెప్పడానికి ఉదాహరణ అని.. సినిమాకు సంబంధించి ఆర్టిస్టులను మించి అందరూ హరిని కొనియాడుతుంటే చాలా ఆనందంగా ఉందని హీరో తేజ సజ్జ చెప్పడం గమనార్హం. ఈ సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లోనే మూణ్నాలుగు పెద్ద సినిమాలకు హరి గౌర సంగీతం అందించబోతున్నాడట.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…