రెండు నెలల కిందట కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏ సినిమాకైనా సరే.. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.200కు మించకూడదంటూ జీవో ఇచ్చింది. దక్షిణాదిన టికెట్ల ధరలు అధికంగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ మల్టీప్లెక్సుల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉండేది. అంటే డిమాండును బట్టి ఎంతైనా రేటు పెంచుకుంటారన్నమాట. ఈ ప్రకారం కొన్ని సినిమాలకు రూ.800 నుంచి 1000 వరకు కూడా రేటు పెట్టేవాళ్లు. మల్టీప్లెక్సుల్లో క్రేజున్న పెద్ద సినిమాలకు 400 మించి రేటు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది.
ఐతే దీని మీద జనం నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రూ.200 క్యాప్ పెడుతూ జీవో ఇచ్చింది. ఐతే అది వెంటనే అమల్లోకి రాలేదు. తాజాగా నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఐతే ట్యాక్సులతో కలిపి అక్కడ మల్టీప్లెక్స్లో గరిష్ట రేటు రూ.236గా మారింది. సింగిల్ స్క్రీన్లయినా, మల్టీప్లెక్సులైనా బెంగళూరులో ఇక ఏ సినిమాకు రేటు రూ.236కు మించదు. రిక్లైనర్స్ సీట్లు అయినా దీనికి మించి రేటు పెట్టడానికి వీల్లేదు. అలా అని పూర్తిగా అన్ని మల్టీప్లెక్సులూ దీని పరిధిలోకి వస్తాయా అంటే అలా ఏం కాదు.
75 అంతకంటే తక్కువ సీటింగ్ సామర్థ్యంతో మల్టీప్లెక్సుల్లో కొన్ని ప్రీమియం స్క్రీన్లు ఉంటాయి. వాటిని ఈ రేట్ క్యాప్ నుంచి మినహాయించారు. వాటి రేటు థియేటర్ల ఇష్టం. ఐతే అలాంటి స్క్రీన్లు మరీ ఎక్కువ ఉండవు. కాబట్టి సామాన్య ప్రేక్షకులపై భారం పడనట్లే. లగ్జరీ కావాలనుకున్న వాళ్లు ఎక్కువ రేట్లు పెట్టి వెళ్తారు. ఈ నిర్ణయం కన్నడ చిత్రాల మీదే కాక వివిధ భాషల సినిమాల మీద ప్రభావం చూపనుంది. బెంగళూరులో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి తెలుగు సినిమాల బిజినెస్లో కొంత మార్పులు జరగొచ్చు. రేట్ క్యాప్ పెంచడం వల్ల ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు పెరిగి బ్యాలెన్స్ జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి.
This post was last modified on September 13, 2025 5:28 pm
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…