Movie News

అన్నతో కలిపి ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన మనోజ్

కొన్ని నెలల పాటు తీవ్ర ఘర్షణతో సాగిన మంచు కుటుంబ వివాదం ఈ మధ్యే కాస్త సద్దుమణిగినట్లుగా కనిపిస్తోంది. మంచు విష్ణు, మంచు మనోజ్ ఎవరికి వాళ్లు సినిమాల పరంగా బిజీ అయ్యాక కుటుంబ వివాదం కొంచెం పక్కకు వెళ్లింది. ‘కన్నప్ప’ రిలీజైనపుడు మంచు మనోజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే కాక.. తన అన్న పెర్ఫామెన్స్‌ను కొనియాడుతూ పోస్టు పెట్టాడు. ఇటీవల ‘మిరాయ్’ సినిమాకు మంచు విష్ణు విష్ చేయడంతో ఇద్దరి మధ్య మరింత దూరం తగ్గినట్లు అనిపించింది. ఇప్పుడు ‘మిరాయ్’ సక్సెస్ మీట్లో మంచు మనోజ్.. తన అన్న గురించి ప్రస్తావించడం మంచు అభిమానులకు గొప్ప ఉపశమనం.

ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మనోజ్ ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఐతే అది మామూలుగా జరగలేదు. ప్రభాస్ తమ అన్నదమ్ములిద్దరికీ సాయం చేశాడని పేర్కొంటూ రెబల్ స్టార్‌కు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్. ప్రభాస్.. ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నతో కలిపి ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు మనోజ్.

విష్ణు పేరు ఎత్తకపోయినా.. అన్నను కలుపుకొని మాట్లాడాడంటే గొడవలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడ్డట్లే అని భావిస్తున్నారు. అదే సమయంలో మనోజ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అతను తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టాడన్నాడు. తన పిల్లల్ని తాను పెరిగినట్లుగా పెంచగలనా లేదా అనే భయం తనలో ఉండేదని.. ఆ భయాన్ని కార్తీక్ చంపేశాడని.. కెరీర్ పట్ల తనకు ఈ సినిమా ఎన్నో ఆశలు రేకెత్తించిందంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ వ్యాఖ్యానించాడు మనోజ్.

This post was last modified on September 13, 2025 5:25 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago