మిరాయ్ మొదటి రోజు మంచి ఓపెనింగ్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ 27 కోట్లకు పైగా గ్రాస్ రావడం మాములు విషయం కాదు. ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు ఈ ఫిగర్ ని అందుకోవడానికి కిందా మీద పడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. మిరాయ్ ఏపీ, తెలంగాణలో ఎలాంటి టికెట్ ధరల పెంపుకు వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల కోణంలో గొప్ప ఊరటనిచ్చింది. తెలంగాణలో గరిష్టంగా అనుమతి ఉన్న 295 రూపాయలను మల్టీప్లెక్స్ రేటుగా ఫిక్స్ చేయగా, ఆంధ్రప్రదేశ్ లో 177 రూపాయలకు ఒక్క పైసా అదనంగా పెట్టకపోవడం భారీ ఫుట్ ఫాల్స్ ని తీసుకొస్తోంది.
ఒకవేళ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున నిర్మాత విశ్వప్రసాద్ కనక హైక్స్ అడిగి ఉంటే ఏపీ సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేది. కానీ అధిక శాతం ప్రేక్షకులు ముఖ్యంగా చిన్న పిల్లలు చూడాలన్న లక్ష్యంతో ఆయన దాని జోలికి వెళ్ళలేదు. అదే ఇప్పుడు గొప్ప మేలు చేస్తోంది. బిసి సెంటర్స్ లో మిరాయ్ కలెక్షన్లు ఉదృతంగా ఉండటానికి ఇది దోహదం చేస్తున్న మాట వాస్తవం. ఒక్కో టికెట్ మీద యాభై నుంచి వంద దాకా పెంపు తప్పించుకోవడం అంటే సగటు మధ్య తరగతి ప్రేక్షకుడికి చాలా పొదుపు జరిగినట్టు. కుటుంబం మొత్తం మీద మూడు నాలుగు వందలు మిగలడం అంటే మాటలు కాదు.
గత రెండు మూడు నెలల్లో కేవలం ఈ పెంపుల వల్లే రెవిన్యూ తగ్గించుకున్న సినిమాలున్నాయి. కుబేర మంచి టాక్ ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోలేదు. హిట్ 3 ది థర్డ్ కేస్ రెండో వారం వచ్చేలోపే ఇబ్బందులు పడింది. హరిహర వీరమల్లుకి ఈ దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలింది. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే కనీసం వారం రోజులు మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేసే కెపాసిటీ ఉన్న స్టార్లు సైతం ఈ టికెట్ రేట్ల పంచాయితీ వల్ల డెఫిషిట్లు చూడాల్సి వస్తోంది. ఈ కోణంలో చూస్తే మిరాయ్ ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాలు దీన్ని ఫాలో కావడం అవసరం.
This post was last modified on September 13, 2025 1:06 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…