నిర్మాతల కొడుకుల్లో చాలామంది హీరోలవుతుంటారు తప్ప.. ప్రొడక్షన్ కంటిన్యూ చేయడం తక్కువ. టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్లలో ఒకడైన రాజేంద్ర ప్రసాద్ తనయుడైన జగపతిబాబు కూడా ఆ దారినే ఎంచుకున్నాడు. ఆయన హీరోగా ఎదిగే క్రమంలో తండ్రి నిర్మించిన సినిమాల్లో నటించాడు తప్ప.. సొంతంగా మాత్రం ప్రొడక్షన్ చేయలేదు. తన మనస్తత్వానికి నిర్మాణం సరిపోదనే అనేవారు జగపతి.
హీరో వేషాలకు స్వస్తి చెప్పి విలన్, క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టాక కూడా ఆయన నిర్మాణం జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు జగపతిబాబు నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు. ఆయన్ని ఒక యువ దర్శకుడు ఆ దిశగా ఇన్స్పైర్ చేశాడు. అతనే.. సాయి మార్తాండ్. ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. జగపతిబాబు ప్రొడక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మార్తాండే స్వయంగా వెల్లడించాడు.
‘లిటిల్ హార్ట్స్’లో రాజీవ్ కనకాల చేసిన హిలేరియస్ ఫాదర్ క్యారెక్టర్ను జగపతిబాబుతోనే చేయించాలనుకున్నాడట సాయి మార్తాండ్. ముందు కథ చెప్పింది కూడా ఆయనకేనట. కానీ ఏవో కారణాల వల్ల జగపతిబాబు ఈ సినిమా చేయలేకపోయారట. కానీ సాయి మార్తాండ్ నరేషన్ నచ్చి.. ఆ పాత్ర చేయలేకపోయానే అనే గిల్ట్ వెంటాడి.. తనతో వేరే సినిమ ా చేస్తానని, ఆ చిత్రాన్ని తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడట జగపతిబాబు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా తనకు జగపతిబాబు ఫోన్ చేసి.. తనకు పదే పదే ‘లిటిల్ హార్ట్స్’ కథ, అందులో తనతో చేయించాలనుకున్న పాత్ర గుర్తుకు వస్తున్నాయని చెప్పి.. తన ప్రొడక్షన్లో సినిమా చేయమని చెప్పారని.. తాను ఓకే చెప్పానని మార్తాండ్ వెల్లడించాడు. ప్రస్తుతానికి తనకున్న కమిట్మెంట్ ఆ సినిమానే అని సాయి మార్తాండ్ తెలిపాడు. అసలు ప్రొడక్షనే వద్దనుకున్న సీనియర్ నటుడితే.. కెరీర్లో ఈ దశలో సినిమా నిర్మించడానికి రెడీ అయ్యేలా చేయడమంటే చిన్న విషయం కాదు.
This post was last modified on September 12, 2025 4:00 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…