ఈ మధ్య సినిమా ఫ్లోకి అడ్డం వస్తుందంటే ఏదైనా మంచి పాట తీసేయడానికి దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదు. అది లక్షలు కోట్ల ఖర్చుతో తీసిన సాంగ్ అయినా సరే. తాజాగా విడుదలైన మిరాయ్ లో ‘వైబ్ ఉందిలే పిల్లా వైబ్ ఉందిలే’ పాట థియేటర్లలో రాలేదు. రెండు గంటల యాభై నిమిషాల నిడివిలో ఇది లేకపోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మొదలయ్యాక ఎక్కడో ఒక చోట వస్తుంది లెమ్మని ఎదురు చూసే కొద్దీ క్లైమాక్స్ వచ్చేసింది కానీ తేజ సజ్జ, రితిక వర్మ స్టెప్పులు మాత్రం దర్శనమివ్వలేదు. ఆ మధ్య కింగ్డమ్ లోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడిన సంగతి గుర్తే. అసలిలా ఎందుకు జరిగిందో చూద్దాం.
టైటిల్ కార్డు నుంచి చివరి ఘట్టం దాకా మిరాయ్ ఒక పద్ధతి ప్రకారం డివోషన్, యాక్షన్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని బలవంతంగా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని ఇరికించే ప్రయత్నం చేయలేదు ఆ స్కోప్ ఉన్నా అనవసరంగా లెన్త్ పెరుగుతుందని భావించి రెగ్యులర్ ఫార్ములా జోలికి వెళ్ళలేదు. అసలు తేజ, రితిక మధ్య లవ్ కెమిస్ట్రీ చూపించనప్పుడు ఇక సాంగ్ ప్రస్తావన ఎందుకు వస్తుంది. అందులోనూ ఒకవేళ పెట్టినా మంచి సీరియస్ టోన్ లో సాగుతున్న కంటెంట్ లో స్పీడ్ బ్రేకర్ లా పాట అనిపిస్తుందే తప్ప ఇంకో ఫీలింగ్ రాదు. అందుకే నిడివి కోసం కట్ చేయడం సబబే.
కొద్దిరోజులు అయ్యాక మళ్ళీ జత చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ దేవరలో దావూదిని రెండు వారాల తర్వాత కలిపారు. అప్పటికే ఆడియన్స్ భారీ సంఖ్యలో సినిమాని చూసేసి ఉండటంతో పెద్దగా ఇబ్బంది కలగలేదు. మిరాయ్ కి కూడా అలా చేస్తారేమో చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం. మూస సూత్రాలకు కట్టుబడి ఖచ్చితంగా హీరో హీరోయిన్ మధ్య పాట ఉండాలని బలవంతంగా ఇరికించే ప్రయత్నాలు చేయకపోవడం న్యూ జెన్ ఫిలిం మేకర్స్ చూపిస్తున్న మంచి పరిణామం. ఎలాగూ వైబ్ ఉందిలే వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…