ఈ మధ్య సినిమా ఫ్లోకి అడ్డం వస్తుందంటే ఏదైనా మంచి పాట తీసేయడానికి దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదు. అది లక్షలు కోట్ల ఖర్చుతో తీసిన సాంగ్ అయినా సరే. తాజాగా విడుదలైన మిరాయ్ లో ‘వైబ్ ఉందిలే పిల్లా వైబ్ ఉందిలే’ పాట థియేటర్లలో రాలేదు. రెండు గంటల యాభై నిమిషాల నిడివిలో ఇది లేకపోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మొదలయ్యాక ఎక్కడో ఒక చోట వస్తుంది లెమ్మని ఎదురు చూసే కొద్దీ క్లైమాక్స్ వచ్చేసింది కానీ తేజ సజ్జ, రితిక వర్మ స్టెప్పులు మాత్రం దర్శనమివ్వలేదు. ఆ మధ్య కింగ్డమ్ లోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడిన సంగతి గుర్తే. అసలిలా ఎందుకు జరిగిందో చూద్దాం.
టైటిల్ కార్డు నుంచి చివరి ఘట్టం దాకా మిరాయ్ ఒక పద్ధతి ప్రకారం డివోషన్, యాక్షన్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని బలవంతంగా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని ఇరికించే ప్రయత్నం చేయలేదు ఆ స్కోప్ ఉన్నా అనవసరంగా లెన్త్ పెరుగుతుందని భావించి రెగ్యులర్ ఫార్ములా జోలికి వెళ్ళలేదు. అసలు తేజ, రితిక మధ్య లవ్ కెమిస్ట్రీ చూపించనప్పుడు ఇక సాంగ్ ప్రస్తావన ఎందుకు వస్తుంది. అందులోనూ ఒకవేళ పెట్టినా మంచి సీరియస్ టోన్ లో సాగుతున్న కంటెంట్ లో స్పీడ్ బ్రేకర్ లా పాట అనిపిస్తుందే తప్ప ఇంకో ఫీలింగ్ రాదు. అందుకే నిడివి కోసం కట్ చేయడం సబబే.
కొద్దిరోజులు అయ్యాక మళ్ళీ జత చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ దేవరలో దావూదిని రెండు వారాల తర్వాత కలిపారు. అప్పటికే ఆడియన్స్ భారీ సంఖ్యలో సినిమాని చూసేసి ఉండటంతో పెద్దగా ఇబ్బంది కలగలేదు. మిరాయ్ కి కూడా అలా చేస్తారేమో చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం. మూస సూత్రాలకు కట్టుబడి ఖచ్చితంగా హీరో హీరోయిన్ మధ్య పాట ఉండాలని బలవంతంగా ఇరికించే ప్రయత్నాలు చేయకపోవడం న్యూ జెన్ ఫిలిం మేకర్స్ చూపిస్తున్న మంచి పరిణామం. ఎలాగూ వైబ్ ఉందిలే వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్.
This post was last modified on September 12, 2025 2:03 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…