మిరాయ్.. టాలీవుడ్ వైపు ఇతర భాషల ప్రేక్షకులు మరోసారి చూసేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్న సినిమా. ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు తేజ సజ్జ. ఆ తర్వాత సరైన ప్లానింగ్తో ‘మిరాయ్’ లాంటి మరో సూపర్ హీరో అడ్వెంచరస్ ఫిలిం చేశాడు. దీని టీజర్, ట్రైలర్ వేరే భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి.
ఆయా భాషల్లో పేరున్న నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో.. పాజిటివ్ టాక్ వస్తే ‘హనుమాన్’ స్థాయిలోనే ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిలో ఈ సినిమా పడడానికి కారణం.. టీజర్, ట్రైలర్లలో చూపించిన భారీ విజువల్స్, ఎఫెక్ట్స్. ముఖ్యంగా ఒక భారీ పక్షి అవతారంతో హీరో అడ్వెంచర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయనే సంకేతాలను ప్రోమోలు ఇచ్చాయి.
ఈ పక్షి వెనుక పెద్ద కథే ఉందని యూనిట్ వర్గాల సమాచారం. సినిమాలో రాముడి పాత్ర కీలకంగా ఉంటుందని టీం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. రాముడికి సాయం చేసిన జటాయు అనే పక్షి గురించి అందరికీ తెలుసు. దాని సోదరుడైన సంపతి అనే పక్షి రాజును ‘మిరాయ్’లో చూపించబోతున్నారు. జటాయు, సంపతి సూర్యుడి పుత్రులట. తన సోదరుడైన జటాయును కాపాడే క్రమంలో సంపతి రెక్కలు కాలిపోతాయి.
సంపతి ఎగరలేని స్థితిలో ఉన్నప్పటికీ అది లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను వానర సైన్యానికి చూపించి రామాయణంలో తన వంతు పాత్రను పోషించిందట. ఆ పక్షి రాజు పాత్రను ‘మిరాయ్’లో చూపించబోెతున్నారు. కథా గమనంలో కీలక మలుపుకి ఈ పక్షి కారణమవుతుందట. దీని సాయంతోనే హీరో తన లక్ష్యానికి చేరువ అవుతాడట. భారీగా ఖర్చు చేసి వీఎఫెక్స్ సాయంతో ఈ పక్షిని రూపొందించింది చిత్రం. దీంతో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాలో హైలైట్గా ఉంటాయని అంటున్నారు.
This post was last modified on September 10, 2025 4:18 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…