మిరాయ్.. టాలీవుడ్ వైపు ఇతర భాషల ప్రేక్షకులు మరోసారి చూసేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్న సినిమా. ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు తేజ సజ్జ. ఆ తర్వాత సరైన ప్లానింగ్తో ‘మిరాయ్’ లాంటి మరో సూపర్ హీరో అడ్వెంచరస్ ఫిలిం చేశాడు. దీని టీజర్, ట్రైలర్ వేరే భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి.
ఆయా భాషల్లో పేరున్న నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో.. పాజిటివ్ టాక్ వస్తే ‘హనుమాన్’ స్థాయిలోనే ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిలో ఈ సినిమా పడడానికి కారణం.. టీజర్, ట్రైలర్లలో చూపించిన భారీ విజువల్స్, ఎఫెక్ట్స్. ముఖ్యంగా ఒక భారీ పక్షి అవతారంతో హీరో అడ్వెంచర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయనే సంకేతాలను ప్రోమోలు ఇచ్చాయి.
ఈ పక్షి వెనుక పెద్ద కథే ఉందని యూనిట్ వర్గాల సమాచారం. సినిమాలో రాముడి పాత్ర కీలకంగా ఉంటుందని టీం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. రాముడికి సాయం చేసిన జటాయు అనే పక్షి గురించి అందరికీ తెలుసు. దాని సోదరుడైన సంపతి అనే పక్షి రాజును ‘మిరాయ్’లో చూపించబోతున్నారు. జటాయు, సంపతి సూర్యుడి పుత్రులట. తన సోదరుడైన జటాయును కాపాడే క్రమంలో సంపతి రెక్కలు కాలిపోతాయి.
సంపతి ఎగరలేని స్థితిలో ఉన్నప్పటికీ అది లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను వానర సైన్యానికి చూపించి రామాయణంలో తన వంతు పాత్రను పోషించిందట. ఆ పక్షి రాజు పాత్రను ‘మిరాయ్’లో చూపించబోెతున్నారు. కథా గమనంలో కీలక మలుపుకి ఈ పక్షి కారణమవుతుందట. దీని సాయంతోనే హీరో తన లక్ష్యానికి చేరువ అవుతాడట. భారీగా ఖర్చు చేసి వీఎఫెక్స్ సాయంతో ఈ పక్షిని రూపొందించింది చిత్రం. దీంతో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాలో హైలైట్గా ఉంటాయని అంటున్నారు.
This post was last modified on September 10, 2025 4:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…