సినిమాటిక్ యూనివర్శ్.. మల్టీవర్స్.. ఇండియన్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ట్రెండ్. ‘విక్రమ్’ సినిమాలోని క్యారెక్టర్లకు ‘ఖైదీ’ చిత్రంలోని పాత్రలతో కనెక్షన్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పేరుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు లోకేష్ కనకరాజ్. అంతకంటే ముందు బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు.. తమ స్పై సినిమల్లో ఇలాంటి కనెక్షన్లతో ప్రేక్షకులను అలరించారు. ఐతే హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఈ ట్రెండ్ చూస్తున్నాం.
పాపులర్ సూపర్ హీరో పాత్రలన్నింటినీ ఒక చోటికి చేర్చి ‘ఎవెంజర్స్’ పేరుతో ఫ్రాంఛైజీ సినిమాలు తీయడం ద్వారా ఎప్పటికప్పుడు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది హాలీవుడ్. కొన్నేళ్ల కిందట ‘ఎండ్ గేమ్’ పేరుతో సినిమా తీసి ఈ ఫ్రాంఛైజీకి తెరదించేశారు మేకర్స్. ఐతే అక్కడ ముగిసిన ట్రెండును ఇండియాలో కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ.
తన కొత్త చిత్రం ‘మిరాయ్’ ప్రమోషన్లలో భాగంగా కేరళకు వెళ్లిన తేజ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ గురించి హింట్ ఇచ్చాడు. తేజ ఇప్పటికే ‘హనుమాన్’లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు ‘మిరాయ్’లో సూపర్ యోధగా అలాంటి పాత్రే ఇంకొకటి చేశాడు. ఇటీవలే మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ ‘లోకా’ వచ్చింది. అందులో తొలిసారి ఒక హీరోయిన్ని సూపర్ హీరోగా చూశాం. మలయాళం నుంచే ‘మిన్నల్ మురళి’ రూపంలో మరో సూపర్ హీరో సినిమా ఉంది.
ఈ పాత్రలన్నింటినీ కలిపి భవిష్యత్తులో ‘ఎవెంజర్స్’ తరహా మల్టీవర్స్ తీస్తే బాగుంటుందని తేజ అన్నాడు. ఈ ఆలోచన నిజం అయినా ఆశ్చర్యం లేదని.. ఎవరైనా అలాంటి సినిమా తీస్తే నటించడానికి తాను రెడీ అని అతనన్నాడు. మరి తేజ చెప్పిన క్రేజీ ఐడియాను ఎవరైనా సీరియస్గా తీసుకుని ఇండియన్ ఎవెంజర్స్ను తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి.
This post was last modified on September 10, 2025 1:50 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…