సినిమాటిక్ యూనివర్శ్.. మల్టీవర్స్.. ఇండియన్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ట్రెండ్. ‘విక్రమ్’ సినిమాలోని క్యారెక్టర్లకు ‘ఖైదీ’ చిత్రంలోని పాత్రలతో కనెక్షన్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పేరుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు లోకేష్ కనకరాజ్. అంతకంటే ముందు బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు.. తమ స్పై సినిమల్లో ఇలాంటి కనెక్షన్లతో ప్రేక్షకులను అలరించారు. ఐతే హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఈ ట్రెండ్ చూస్తున్నాం.
పాపులర్ సూపర్ హీరో పాత్రలన్నింటినీ ఒక చోటికి చేర్చి ‘ఎవెంజర్స్’ పేరుతో ఫ్రాంఛైజీ సినిమాలు తీయడం ద్వారా ఎప్పటికప్పుడు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది హాలీవుడ్. కొన్నేళ్ల కిందట ‘ఎండ్ గేమ్’ పేరుతో సినిమా తీసి ఈ ఫ్రాంఛైజీకి తెరదించేశారు మేకర్స్. ఐతే అక్కడ ముగిసిన ట్రెండును ఇండియాలో కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ.
తన కొత్త చిత్రం ‘మిరాయ్’ ప్రమోషన్లలో భాగంగా కేరళకు వెళ్లిన తేజ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ గురించి హింట్ ఇచ్చాడు. తేజ ఇప్పటికే ‘హనుమాన్’లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు ‘మిరాయ్’లో సూపర్ యోధగా అలాంటి పాత్రే ఇంకొకటి చేశాడు. ఇటీవలే మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ ‘లోకా’ వచ్చింది. అందులో తొలిసారి ఒక హీరోయిన్ని సూపర్ హీరోగా చూశాం. మలయాళం నుంచే ‘మిన్నల్ మురళి’ రూపంలో మరో సూపర్ హీరో సినిమా ఉంది.
ఈ పాత్రలన్నింటినీ కలిపి భవిష్యత్తులో ‘ఎవెంజర్స్’ తరహా మల్టీవర్స్ తీస్తే బాగుంటుందని తేజ అన్నాడు. ఈ ఆలోచన నిజం అయినా ఆశ్చర్యం లేదని.. ఎవరైనా అలాంటి సినిమా తీస్తే నటించడానికి తాను రెడీ అని అతనన్నాడు. మరి తేజ చెప్పిన క్రేజీ ఐడియాను ఎవరైనా సీరియస్గా తీసుకుని ఇండియన్ ఎవెంజర్స్ను తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…