సినిమాటిక్ యూనివర్శ్.. మల్టీవర్స్.. ఇండియన్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ట్రెండ్. ‘విక్రమ్’ సినిమాలోని క్యారెక్టర్లకు ‘ఖైదీ’ చిత్రంలోని పాత్రలతో కనెక్షన్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పేరుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు లోకేష్ కనకరాజ్. అంతకంటే ముందు బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు.. తమ స్పై సినిమల్లో ఇలాంటి కనెక్షన్లతో ప్రేక్షకులను అలరించారు. ఐతే హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఈ ట్రెండ్ చూస్తున్నాం.
పాపులర్ సూపర్ హీరో పాత్రలన్నింటినీ ఒక చోటికి చేర్చి ‘ఎవెంజర్స్’ పేరుతో ఫ్రాంఛైజీ సినిమాలు తీయడం ద్వారా ఎప్పటికప్పుడు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది హాలీవుడ్. కొన్నేళ్ల కిందట ‘ఎండ్ గేమ్’ పేరుతో సినిమా తీసి ఈ ఫ్రాంఛైజీకి తెరదించేశారు మేకర్స్. ఐతే అక్కడ ముగిసిన ట్రెండును ఇండియాలో కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ.
తన కొత్త చిత్రం ‘మిరాయ్’ ప్రమోషన్లలో భాగంగా కేరళకు వెళ్లిన తేజ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ‘ఎవెంజర్స్’ గురించి హింట్ ఇచ్చాడు. తేజ ఇప్పటికే ‘హనుమాన్’లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు ‘మిరాయ్’లో సూపర్ యోధగా అలాంటి పాత్రే ఇంకొకటి చేశాడు. ఇటీవలే మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ ‘లోకా’ వచ్చింది. అందులో తొలిసారి ఒక హీరోయిన్ని సూపర్ హీరోగా చూశాం. మలయాళం నుంచే ‘మిన్నల్ మురళి’ రూపంలో మరో సూపర్ హీరో సినిమా ఉంది.
ఈ పాత్రలన్నింటినీ కలిపి భవిష్యత్తులో ‘ఎవెంజర్స్’ తరహా మల్టీవర్స్ తీస్తే బాగుంటుందని తేజ అన్నాడు. ఈ ఆలోచన నిజం అయినా ఆశ్చర్యం లేదని.. ఎవరైనా అలాంటి సినిమా తీస్తే నటించడానికి తాను రెడీ అని అతనన్నాడు. మరి తేజ చెప్పిన క్రేజీ ఐడియాను ఎవరైనా సీరియస్గా తీసుకుని ఇండియన్ ఎవెంజర్స్ను తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి.
This post was last modified on September 10, 2025 1:50 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…