మొత్తానికి చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా కార్యరూపం దాల్చింది. 13 ఏళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘ఢీ’కి సీక్వెల్ రాబోతోంది. మంచు విష్ణు, శ్రీను వైట్ల కలిసి చేయబోతున్న ఈ చిత్రానికి ‘డి అండ్ డి’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఐతే ‘ఢీ’కి సీక్వెల్ అనగానే అందరూ ఆశించేది ఎంటర్టైన్మెంట్. అప్పట్లో ‘ఢీ’ జనాల్ని మామూలుగా నవ్వించలేదు.
సినిమాలో వేరే ఆకర్షణలు కూడా ఉన్నప్పటికీ హైలైట్ అయింది మాత్రం కామెడీనే. ఐతే ఆ సినిమాలో ప్రేక్షకులను నవ్వించే బాధ్యత తీసుకున్న వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు ఎంటర్టైన్ చేసే స్థితిలో లేరు. ‘ఢీ’లో చాలా ప్రత్యేకంగా అనిపించింది, కడుపుబ్బ నవ్వించింది బ్రహ్మానంం చేసిన చారి పాత్రే. అత్యంత భయస్థుడిగా కనిపిస్తూ బ్రహ్మి ఎంతగా నవ్వించాడో.. చివర్లో మందు కొట్టి చెలరేగిపోయే సీన్లో అదే స్థాయిలో కామెడీ పండించాడు.
ఐతే బ్రహ్మి ఇలా నవ్వించి చాలా ఏళ్లయిపోయింది. ఇప్పుడాయన సినిమాల్లో కనిపిస్తేనే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఆయన పాత్రలు వరుసగా తేలిపోతుండటంతో ఆయన ఫేవరెట్ డైరెక్టర్లు సహా అందరూ పక్కన పెట్టేశారు. ఇప్పుడు బ్రహ్మిని కన్సిడర్ చేసే పరిస్థితే లేదు. ఇక బ్రహ్మితో ‘ఢీ’లో భలేగా కెమిస్ట్రీ పండించిన సునీల్ ఇప్పుడసలు కమెడియన్గా అసలు సెట్టవట్లేదు. మధ్యలో హీరో వేషాలేసి ఇమేజ్ దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడతను కామెడీ చేస్తే ఎవరూ చూడట్లేదు కాబట్టి అతణ్ని కూడా ‘ఢీ’ సీక్వెల్కు తీసుకునే పరిస్థితి లేదు.
ఇక ‘ఢీ’లో తమదైన శైలిలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను వినోదపరిచిన శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి మధ్యలో కాలం చేశారు. వాళ్లను రీప్లేస్ చేయడం అంత సులువైన విషయం కాదు. కాబట్టి ‘ఢీ’తో పోలిక రాకుండా భిన్నమైన పాత్రలు, కామెడీ సన్నివేశాలతో నవ్వించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది శ్రీను వైట్ల టీం. ప్రస్తుతం టాప్ కమెడియన్గా కొనసాగుతున్న వెన్నెల కిషోర్ను రంగంలోకి దించితే కొంచెం ప్రయోజనం ఉండొచ్చు.
This post was last modified on November 24, 2020 2:46 pm
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…