ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్ల నుంచి రీమేక్స్ అన్నవి కత్తి మీద సాములా తయారయ్యాయి. ఒక సినిమా రీమేక్ అని తెలియగానే.. దాని విశేషాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. జనం ఒరిజినల్ చూసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. దీంతో కథ పరంగా ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. చాలా వరకు రీమేక్లకు రిజల్ట్ తేడా కొట్టేస్తున్నాయి. ఐతే కొందరు దర్శకులు మాతృకను ఉన్నదున్నట్లు తీయకుండా.. మార్పులు చేర్పులతో కొత్త లుక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత బాగా తీసినా సరే.. రీమేక్ అనగానే దాని చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ ముసురుకుంటోంది.
చివరగా టాలీవుడ్లో రీమేక్తో దెబ్బ తిన్న హీరో.. బెల్లంకొండ శ్రీనివాస్. తమిళ హిట్ ‘గరుడన్’ను ఇంకా భారీగా, కొన్ని మార్పులు చేర్పులు చేసి, మంచి కాస్టింగ్ను పెట్టుకుని ‘భైరవం’ తీశారు. కానీ ఆ సినిమా ఆడలేదు. తాము ఎంత కష్టపడి చేసినప్పటికీ.. రీమేక్ కావడం వల్లే ఈ సినిమా ఆడలేదని బెల్లంకొండ శ్రీనివాస్ తేల్చేశాడు. రీమేక్ చేయడమే తప్పు అని తమకు లేటుగా అర్థమైందని అతను తెలిపాడు.
‘గరుడన్’ అంత పాపులర్ కాని సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా చూసి ఉండరన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేశామని.. రిలీజ్ ముందు వరకు రిజట్ల్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని శ్రీనివాస్ తెలిపాడు. కానీ జనం మాత్రం రీమేకే కదా అని తేలిగ్గా తీసి పడేశారని.. సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదని శ్రీనివాస్ తెలిపాడు. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుబట్టలేనని.. స్వయంగా తాను కూడా వేరే హీరో సినిమా రీమేక్ అంటే.. చూడడానికి ఆసక్తి ప్రదర్శించనని అతనన్నాడు. కేవలం ‘గరుడన్’ సినిమాను ఎక్కువమంది చూసి ఉండరన్న ఉద్దేశంతోనే దాన్ని మరింత భారీగా చేద్దామని ట్రై చేశామని.. తన కెరీర్లో తొలిసారిగా చేసిన రూరల్ డ్రామా కావడంతో అది తనకు చాలా స్పెషల్ అని శ్రీనివాస్ తెలిపాడు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…