ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్ల నుంచి రీమేక్స్ అన్నవి కత్తి మీద సాములా తయారయ్యాయి. ఒక సినిమా రీమేక్ అని తెలియగానే.. దాని విశేషాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. జనం ఒరిజినల్ చూసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. దీంతో కథ పరంగా ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. చాలా వరకు రీమేక్లకు రిజల్ట్ తేడా కొట్టేస్తున్నాయి. ఐతే కొందరు దర్శకులు మాతృకను ఉన్నదున్నట్లు తీయకుండా.. మార్పులు చేర్పులతో కొత్త లుక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత బాగా తీసినా సరే.. రీమేక్ అనగానే దాని చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ ముసురుకుంటోంది.
చివరగా టాలీవుడ్లో రీమేక్తో దెబ్బ తిన్న హీరో.. బెల్లంకొండ శ్రీనివాస్. తమిళ హిట్ ‘గరుడన్’ను ఇంకా భారీగా, కొన్ని మార్పులు చేర్పులు చేసి, మంచి కాస్టింగ్ను పెట్టుకుని ‘భైరవం’ తీశారు. కానీ ఆ సినిమా ఆడలేదు. తాము ఎంత కష్టపడి చేసినప్పటికీ.. రీమేక్ కావడం వల్లే ఈ సినిమా ఆడలేదని బెల్లంకొండ శ్రీనివాస్ తేల్చేశాడు. రీమేక్ చేయడమే తప్పు అని తమకు లేటుగా అర్థమైందని అతను తెలిపాడు.
‘గరుడన్’ అంత పాపులర్ కాని సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా చూసి ఉండరన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేశామని.. రిలీజ్ ముందు వరకు రిజట్ల్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని శ్రీనివాస్ తెలిపాడు. కానీ జనం మాత్రం రీమేకే కదా అని తేలిగ్గా తీసి పడేశారని.. సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదని శ్రీనివాస్ తెలిపాడు. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుబట్టలేనని.. స్వయంగా తాను కూడా వేరే హీరో సినిమా రీమేక్ అంటే.. చూడడానికి ఆసక్తి ప్రదర్శించనని అతనన్నాడు. కేవలం ‘గరుడన్’ సినిమాను ఎక్కువమంది చూసి ఉండరన్న ఉద్దేశంతోనే దాన్ని మరింత భారీగా చేద్దామని ట్రై చేశామని.. తన కెరీర్లో తొలిసారిగా చేసిన రూరల్ డ్రామా కావడంతో అది తనకు చాలా స్పెషల్ అని శ్రీనివాస్ తెలిపాడు.
This post was last modified on September 9, 2025 6:38 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…