శర్వానంద్ కొత్త సినిమా నారి నడుమ మురారి షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా విడుదల ప్రకటన రాలేదు. ఓటిటి డీల్స్ వల్ల అనౌన్స్ మెంట్ లేట్ అయ్యిందనే ప్రచారం జరిగింది కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు తీసిన మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తీరా చూస్తే ఈ ఏడాదిలో రిలీజ్ స్లాట్లు లేవు. సెప్టెంబర్ మినహాయిస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా మొత్తం ప్యాక్ అయిపోయింది. అందుకే 2026 సంక్రాంతికి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. కాకపోతే ఇక్కడ చాలా రిస్కులు ముడిపడి ఉన్నాయి.
నారి నారి నడుమ మురారిలో బోలెడు ఫన్ ఉండొచ్చు. కానీ పండగ కాంపిటీషన్ లో ఉన్న మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజుని ఏ మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. చిరంజీవి, నవీన్ పోలిశెట్టిలతో పోలిస్తే కామెడీ టైమింగ్ లో శర్వానంద్ పోటీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదీ చూడాలనే కన్ఫ్యూజన్ కు లోనైతే ప్రాధాన్యతలు మారిపోతాయి. వీటికి తోడు కిషోర్ తిరుమల తీస్తున్న రవితేజ 77 కూడా వినోదాత్మకంగానే ఉంటుందట. అదే నిజమైతే పరిస్థితి ఇంకా జటిలంగా ఉంటుంది. అసలే ది రాజా సాబ్ ని ఎలా ఎదురుకోవాలోనని ఇతర సినిమాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
వీటికి తోడు తమిళ డబ్బింగులు విజయ్ జన నాయకుడు, శివ కార్తికేయన్ పరాశక్తిలు పండగ బరిలోనే ఉండాలని కంకణం కట్టుకున్నాయి. అలాంటప్పుడు ఇన్నేసి వాటికి థియేటర్ల సర్దుబాటు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు నరకమే. హైదరాబాద్ లాంటి చోట్ల పెద్ద సమస్య కాదు కానీ బిసి సెంటర్లలో అన్నింటిని అకామడేట్ చేయడం అసాధ్యం. మరి నారి నారి నడుమ మురారికి సంబంధించి తిరుగుతున్న వార్త కేవలం పుకారా లేక నిజంగానే సంక్రాంతి వైపు చూస్తున్నారా అనేది వేచి చూడాలి. ఫాన్స్ మాత్రం అంత రిస్క్ ఎందుకు హ్యాపీగా ఒంటరిగా వస్తే ప్రశాంతంగా హిట్టు కొట్టొచ్చు కదా అంటున్నారు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…