ఇండియన్ సినిమా మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ వెనుకటి తరం సూపర్ స్టార్ రిషి కపూర్ గురువారం కన్నుమూశారు. ఇప్పటి వాళ్లకు ఆయన రేంజ్ తెలియక పోవచ్చు కానీ.. 70, 80 దశకాల్లో సినిమాలు చూసిన వాళ్లు రిషి కపూర్ ఎంత పెద్ద స్టారో.. ఆయన సినిమాలు ఏ స్థాయిలో రంజింపజేశాయో కథలు కథలుగా చెబుతారు.
తాత పృథ్వీ రాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు రిషి. రొమాంటిక్ హీరోగా ఆయనకు గొప్ప పేరే ఉంది. తొలి సినిమా ‘బాబీ’తోనే పెద్ద స్టార్ అయిపోయాడు రిషి. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద విజయాన్నందుకుంది.
హైదరాబాద్, విజయవాడ లాంటి చోట్ల వంద రోజులాడింది. ఓ హిందీ సినిమా ఇక్కడ అలా ఆడటం అరుదైన విషయం. ఇక్కడే ఇన్ని రోజులు నడిచిందంటే.. ఉత్తరాదిన ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అంచనా వేయొచ్చు.
ఐతే ఇంత పెద్ద హిట్ సినిమా వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. రిషిని హీరోగా పరిచయం చేయడం కోసం ప్లాన్ చేసి తీసిన సినిమా కాదిది. రిషి అంతకుముందే బాల నటుడిగా నటించిన ‘మేరా నామ్ జోకర్’ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం రాజ్ కపూర్ ‘బాబీ’ తీసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో రిషి వెల్లడించాడు.
‘‘నన్ను వెండితెరకు పరిచయం చేయడం కోసం నాన్న ‘బాబీ’ తీశారని చాలామంది అపోహ పడ్డారు. కానీ ‘మేరా నామ్ జోకర్’ తాలూకు అప్పులు తీర్చడం కోసం ఓ యువ కథ తెరకెక్కించాలని నాన్న భావించారు. నిజానికి ఈ సినిమా కోసం రాజేష్ ఖన్నాను హీరోగా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకు పారితోషకం ఇవ్వడానికి మా నాన్న దగ్గర డబ్బుల్లేక నన్ను ఎంచుకున్నారు. అలా నేను హీరోగా పరిచయం అయ్యాను’’ అని రిషి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు.. రిషికి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
This post was last modified on May 1, 2020 2:55 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…