Movie News

కాపీ సినిమా టార్చర్ పెడుతోందట

యానిమల్, మార్కోని స్ఫూర్తిగా తీసుకుని వయోలెన్స్ ఉంటే చాలు ఆడియన్స్ ఎగబడి చూస్తారనే భ్రమలో తీసిన బాలీవుడ్ మూవీ భాగీ 4. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ లో ఈ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో మొదటిరోజుకు ముందే లక్షన్నర టికెట్లు అమ్ముడుపోవడం విశేషమే. కన్నడ దర్శకుడు హర్ష (గోపీచంద్ భీమా తీసింది ఈయనే) కి హిందీ డెబ్యూ ఇది. ఇలా చెప్పుకోదగ్గ హైప్ తో వచ్చిన భాగీ 4 మీద హిందీ రివ్యూయర్లు విరుచుకుపడుతున్నారు. దారుణంగా టార్చర్ పెట్టిన సినిమాగా ఒకటి రెండు రేటింగులు ఇచ్చి చెడుగుడు ఆడేశారు.

ఇంతా చేసి ఇదేమి ఒరిజినల్ కథ కాదు. 2013లో ప్రేమిస్తే భరత్ హీరోగా అయింతు అయింతు అయింతు అనే సినిమా వచ్చింది. అప్పటిదాకా ఫ్లాపుల్లో ఉన్న భరత్ కు మంచి కంబ్యాక్ అయ్యింది. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ పాయింట్ ని యధాతథంగా భాగీ 4లో వాడుకున్నారు. ఏడు నెలల కోమా నుంచి బయటికి వచ్చిన హీరో అలియాస్ టైగర్ శ్రోఫ్ గతాన్ని మర్చిపోతాడు. లేని ప్రియురాల్ని ఊహించుకుంటూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే విలన్ చాకో అలియాస్ సంజయ్ దత్ ఎంట్రీ ఇస్తాడు. అసలు టైగర్ జీవితంలో ఏం జరిగింది, ఎవరు ఇదంతా చేశారనేది ఈజీగా ఊహించుకోవచ్చు .

ఇలా ఆసుపత్రి బెడ్ మీద నుంచి హఠాత్తుగా లేచి గతాన్ని వాడుకోవడమనే పాయింట్ ని గోపీచంద్ ఒంటరిలో ఎప్పుడో వాడారు. కానీ ఆ సినిమా ఆడలేదు. బాలకృష్ణ లయన్ లోనూ ఇలాంటి ఎపిసోడ్ ఉంటుంది. అదీ ఫ్లాపే. ఇప్పుడు భాగీ 4 వంతు వచ్చింది. విపరీతమైన హింస, లక్షల బుల్లెట్లు, కత్తిపోట్లు హీరో విలన్ ని ఏం చేయవు కానీ వందల వేల సంఖ్యలో రౌడీలు మాత్రం పిట్టల్లా ఎగిరిపోతుంటారు. జుగుప్స అనిపించే సన్నివేశాలకు లోటు లేకుండా డైరెక్టర్ భరించరాని హింసని చూపించి థియేటర్ జనాలను హింసించేశారు. మరి నార్త్ ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. 

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago