ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి వివాదాస్పద సినిమాలతో పేరు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది బెంగాల్ ఫైల్స్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 గంటల 26 నిమిషాల సుదీర్ఘ నిడివితో చాలా పెద్ద కంటెంట్ ఇచ్చిన వివేక్ విడుదలకు ముందే కాంట్రవర్సీలు కొని తెచ్చుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో ఈ మూవీని ప్రదర్శించేందుకు సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు వెనుకంజ వేయడం హాట్ టాపిక్ అయ్యింది. మమతా బెనర్జీ ప్రభుత్వం కావాలని తమ సినిమాను తొక్కి పెడుతోందని వివేజ్, ఆయన భార్య కం నటి పల్లవి జోషి ఆరోపిస్తున్నారు.
ఇంతగా వివాదం రేగడానికి కారణం వివేక్ అగ్నిహోత్రి తీసుకున్న బ్యాక్ డ్రాప్. 1946 కోల్కతాలో జరిగిన మారణహోమం, నోఖాలి అల్లర్లను కథాంశంగా తీసుకుని ఇందులో సవివరంగా చూపించారు. డైరెక్ట్ యాక్షన్ డేగా చరిత్రలో నిలిచిపోయిన ఆ సంవత్సరం ఆగస్ట్ 14 నాటి ఘటనలు, దాని పూర్వాపరాలు, అప్పటి స్వతంత్ర సమరయోధులు, నాయకులు ఏం చేశారనే పాయింట్ మీద ఇది రూపొందింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి తదితర సీనియర్లు చాలానే నటించారు. అత్యంత ఎక్కువ నిడివి ఉన్న భారతీయ టాప్ 5 సినిమాల్లో ది బెంగాల్ ఫైల్స్ చోటు దక్కించుకోవడం గమనార్షం.
ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వివేక్ అగ్నిహోత్రి మరోసారి దేశాన్ని కుదిపేసే కథను చెప్పారని విమర్శలు మెచ్చుకుంటున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ అప్పుడు రేగిన వసూళ్ల సునామి మళ్ళీ చూడొచ్చంటూ బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. బిజెపి అజెండాను మోస్తారని పేరున్న వివేక్ ఈ నెగటివిటీని పట్టించుకోవడం లేదు. బెంగాల్ లో అనఫీషియల్ బ్యాన్ మీద పోరాడతానని అంటున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మూర్ కు లేఖ కూడా రాశారు. హైదరాబాద్ లాంటి చోట్ల మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేస్తున్న ది బెంగాల్ ఫైల్స్ నిజంగా జనాలను మెప్పించిందో లేదో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.
This post was last modified on September 5, 2025 3:46 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…