2020 సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల సినీ పరిశ్రమకు అత్యంత విషాదకరమైన సంవత్సరంగా మిగలబోతోంది. కరోనా ధాటికి సినీ కార్మికులంతా అల్లాడిపోతున్నారు. వేల కోట్ల నష్టం ఎదురవుతోంది. ఐతే ఇదంతా ఒక ఎత్తయితే.. బాలీవుడ్లో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఆ పరిశ్రమను మరింత కుంగదీస్తున్నాయి.
మొన్న భారత దేశం గర్వించదగ్గ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్తో కన్నుమూశాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. ఇంకో 24 గంటల్లోనే మరో లెజెండరీ నటుడు రిషి కపూర్ కూడా క్యాన్సర్తోనే మరణించారు.
ఇంకో 24 గంటలు తిరిగేసరికి మరో ప్రముఖుడిని బాలీవుడ్ కోల్పోయింది. ఆయన పేరు.. కుల్మీత్ మక్కర్. ఈయన ఇండియన్ ఫిలిం, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీఈవోగా పని చేస్తున్నారు. నిర్మాత కూడా అయిన కుల్మీత్ గురించి సామాన్య జనానికి పెద్దగా తెలియదు. కానీ బాలీవుడ్ వర్గాల్లో మాత్రం కుల్మీత్ బాగా ఫేమస్.
మన దగ్గర దిల్ రాజు నేతృత్వంలో ఏర్పాటైన ప్రొడ్యూసర్స్ గిల్డ్ లాంటిది బాలీవుడ్ వాళ్లు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు. అది చాలా చురుగ్గా పని చేస్తోంది కూడా. దాన్ని చాలా ఏళ్లుగా నడిపిస్తున్నది కుల్మీతే. ఆయనకు బాలీవుడ్ వర్గాల్లో మంచి పేరుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్న కుల్మీత్కు ఈ రోజు ఉదయం హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచారు.
కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు అగ్ర నిర్మాతలు కుల్మీత్ హఠాన్మరణంపై షాకవుతూ మెసేజ్లు పెట్టారు. ప్రతి రోజూ ఉదయం ఒక ఘోరమైన వార్తతో నిద్ర లేవాల్సి వస్తోందని.. సినీ పరిశ్రమకు కుల్మీత్ చేసిన సేవలు అపారమని కరణ్, ఫర్హాన్ పేర్కొన్నారు.
ఇంకోవైపు మరో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్కు కూడా సీరియస్గా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. ఆ వార్తలు అబద్ధమని, తాను క్షేమంగానే ఉన్నానని ఆయన స్పష్టత ఇచ్చారు.
This post was last modified on May 1, 2020 5:45 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…