బాలకృష్ణ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న అఖండ 2 విడుదల తేదీ సస్పెన్స్ వీగిపోయింది. సంక్రాంతి బరిలో దిగుతుందేమోననే ప్రచారం గత కొద్దిరోజులుగా ఊపందుకుంది. దానికి చెక్ పెడుతూ బాలకృష్ణ స్వయంగా డిసెంబర్ మొదటి వారం రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడంతో చిక్కు ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అయితే ఫలానా డేట్ అని చెప్పలేదు కానీ రాజా సాబ్ వదిలేసిన డిసెంబర్ 5 దాదాపు లాకైనట్టే. ఆ రోజు శుక్రవారం కాబట్టి అదే ఖరారు చేయొచ్చు. ఇంకా దూరం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే నిర్మాత నుంచి అధికారిక ప్రకటన రాకపోవచ్చు.
తమన్ ఎక్కువ సమయం కోరడం వల్లే లేట్ అవుతోందని కుండబద్దలు కొట్టిన బాలయ్య నేరుగా ఓజి ప్రస్తావన తేలేదు కానీ దాని పనుల్లోనే అతను బిజీగా ఉండటం వల్ల అఖండ 2కి ఎక్కువ సమయం కేటాయించలేడన్నది ఓపెన్ సీక్రెట్. ఇదిలా ఉండగా అఖండ 2 చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5 ఎలాంటి పోటీ లేదు. రణ్వీర్ సింగ్ దురంధర్ ఉంది కానీ దక్షిణాది మార్కెట్ లో దాని వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు. పైగా దాని షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ప్రమాదాలు, అవాంతరాలు అడ్డం వస్తుండటంతో టార్గెట్ రీచ్ కావడం గురించి బాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
సో ఎలా చూసుకున్నా అఖండ 2కి సోలో గ్రౌండ్ దొరకడం కలెక్షన్ల పరంగా చాలా ప్లస్ కానుంది. మళ్ళీ డిసెంబర్ 25 దాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి వసూళ్లు గరిష్టంగా లాగించేయొచ్చు. బజ్ చూస్తుంటే అఖండ మొదటి భాగం రికార్డులను డబుల్ మార్జిన్ తో కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. దర్శకుడు బోయపాటి శీను ఈసారి విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారట. ఓజి రిలీజ్ కాగానే అఖండ 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద తమన్ పని చేయబోతున్నాడు. గూస్ బంప్స్ తో థియేటర్లను షేక్ చేస్తానంటున్న తమన్ ఈసారి స్పీకర్లు కాదు ఏకంగా గోడలు బద్దలయ్యే స్కోర్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on September 4, 2025 9:10 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…