రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా అల్లరి నరేష్ తన కొత్త సినిమాతో టాలీవుడ్ కు బోణీ చేయబోతున్నాడు. జనవరి 1 ఆల్కహాల్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ థియేటర్ రన్ పరిమితంగా మారుతుందని తెలిసీ నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గతంలో ఎన్నో సినిమాలు నూతన ఏడాది మొదటి రోజు రిలీజయ్యాయి కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఓ రెండు వారాలు రన్ రావాలంటే ఈ డేట్ సేఫ్ కాదనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు ఈ ఆప్షన్ పెట్టుకోవడం లేదు. కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ రిస్క్ తీసుకుంటోంది.
టీజర్ తో పాటు వచ్చిన ఈ అనౌన్స్ మెంట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటి ప్రకారం ఆల్కహాల్ లో అల్లరి నరేష్ కు మందు అలవాటు ఉండదు. తాగితే జీవితం నాశనం అవుతుందని అతని నమ్మకం. పని చేసే బాస్ ఆఫర్ చేసినా సరే నో అంటాడు. కానీ ఫ్రెండ్స్ కు మాత్రం డ్రింక్స్ పార్టీ ఇవ్వడం ఇతనికున్న విచిత్రమైన అలవాటు. ఒకవేళ తాను ఆఫర్ చేశాక తాగకపోతే కొడతాడు లేదా చంపుతానని బెదిరిస్తాడు. మరి ఇతని వింత ప్రవర్తనకు కారణం ఏంటి, ఎందుకిలా చేస్తున్నాడనేది తెరమీద చూసి తెలుసుకోవాలి. సెటిల్డ్ బాడీ లాంగ్వేజ్ తో అల్లరి నరేష్ కొత్తగా కనిపిస్తున్నాడు.
సీరియస్ జానర్ కు షిఫ్ట్ అయ్యాక అల్లరి నరేష్ కు పెద్దగా కలిసి రావడం లేదు. నాంది మినహాయించి మిగిలినవి ఫెయిలయ్యాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, బచ్చల మల్లి కనీస ఫలితం అందుకోలేదు. కామెడీ ట్రై చేద్దామని ఆ ఒక్కటి అడక్కు చేస్తే ప్రేక్షకులు మేము ఇలా అడగలేదు అంటూ రిజక్ట్ చేశారు. అందుకే ఇప్పుడు స్టైలిష్ ఫన్ వైపుకి వచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఆల్కహాల్ కి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అల్లరి నరేష్. కమెడియన్ సత్యతో పాటు ఇతర ఆర్టిస్టులను పరిచయం చేసిన టీమ్ కథను చెప్పీ చెప్పకుండా అసలు ట్విస్టులు దాచి పెట్టింది. అవేంటో మరి.
This post was last modified on September 4, 2025 1:34 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…