ఓజీ.. ఓజీ.. ఓజీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులే కాక.. తెలుగు సినిమా ప్రియులందరూ ఈ నామస్మరణే చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఈ కొత్త చిత్రానికి హైప్ మూమూలుగా లేదు. పవన్ గత చిత్రం ‘హరిహర వీరమల్లు’ డిజాస్టర్ అయినా.. అంతకుముందు ఆయన్నుంచి వచ్చిన ‘బ్రో’ కూడా నిరాశపరిచినా.. ఆ ప్రభావం ‘ఓజీ’ మీద ఎంతమాత్రం పడలేదు. రోజు రోజుకూ ‘ఓజీ’ హైప్ పెరుగుతోందే తప్ప తగట్లేదు.
లేటెస్ట్గా పవన్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్తో సినిమాకు బజ్ ఇంకా పెరిగింది. ‘ఓజీ’కి వారం కిందటే యుఎస్లో బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ప్రి సేల్స్ 1 మిలియన్ డాలర్లకు చేరువగా వచ్చేయడం విశేషం. విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉండగానే ఇంత వసూళ్లు వచ్చాయంటే.. ప్రిమియర్స్తోనే ఈజీగా ఈ చిత్రం 3 మిలియన్ మార్కును టచ్ చేయడం గ్యారెంటీ.
కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. వీకెండ్లో 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం లాంఛనమే కావచ్చు. ఈ సినిమా యుఎస్ హక్కులను డిస్ట్రిబ్యూటర్ చాలా ముందుగానే సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే భారీ లాభాలు గ్యారెంటీ.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాలకు ముందే అడ్వాన్సులు ఇచ్చారు కొందరు బయ్యర్లు. వాళ్లకు కూడా రీజనబుల్ రేటుకు సినిమా దక్కుతుంది. ఇప్పుడు హైప్, బాక్సాఫీస్ అనుకూల పరిస్థితుల్లో సినిమా మంచి లాభాలను అందించే అవకాశముంది. ఈ ఏడాది పెద్ద సినిమాలు చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లను దెబ్బ కొట్టినవే. ‘ఓజీ’ హైప్కు తగ్గట్లు ఉంటే మాత్రం ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్లందరికీ మంచి ఫలితమే దక్కొచ్చు.
This post was last modified on September 3, 2025 4:15 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…