ఓజీ.. ఓజీ.. ఓజీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులే కాక.. తెలుగు సినిమా ప్రియులందరూ ఈ నామస్మరణే చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఈ కొత్త చిత్రానికి హైప్ మూమూలుగా లేదు. పవన్ గత చిత్రం ‘హరిహర వీరమల్లు’ డిజాస్టర్ అయినా.. అంతకుముందు ఆయన్నుంచి వచ్చిన ‘బ్రో’ కూడా నిరాశపరిచినా.. ఆ ప్రభావం ‘ఓజీ’ మీద ఎంతమాత్రం పడలేదు. రోజు రోజుకూ ‘ఓజీ’ హైప్ పెరుగుతోందే తప్ప తగట్లేదు.
లేటెస్ట్గా పవన్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్తో సినిమాకు బజ్ ఇంకా పెరిగింది. ‘ఓజీ’కి వారం కిందటే యుఎస్లో బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ప్రి సేల్స్ 1 మిలియన్ డాలర్లకు చేరువగా వచ్చేయడం విశేషం. విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉండగానే ఇంత వసూళ్లు వచ్చాయంటే.. ప్రిమియర్స్తోనే ఈజీగా ఈ చిత్రం 3 మిలియన్ మార్కును టచ్ చేయడం గ్యారెంటీ.
కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. వీకెండ్లో 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం లాంఛనమే కావచ్చు. ఈ సినిమా యుఎస్ హక్కులను డిస్ట్రిబ్యూటర్ చాలా ముందుగానే సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే భారీ లాభాలు గ్యారెంటీ.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాలకు ముందే అడ్వాన్సులు ఇచ్చారు కొందరు బయ్యర్లు. వాళ్లకు కూడా రీజనబుల్ రేటుకు సినిమా దక్కుతుంది. ఇప్పుడు హైప్, బాక్సాఫీస్ అనుకూల పరిస్థితుల్లో సినిమా మంచి లాభాలను అందించే అవకాశముంది. ఈ ఏడాది పెద్ద సినిమాలు చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లను దెబ్బ కొట్టినవే. ‘ఓజీ’ హైప్కు తగ్గట్లు ఉంటే మాత్రం ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్లందరికీ మంచి ఫలితమే దక్కొచ్చు.
This post was last modified on September 3, 2025 4:15 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…