ప్రమాణాలు పడిపోయిన తమిళ ఫిలిం ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల్లో వచ్చిన మేటి దర్శకుల్లో ఒకడిగా వెట్రిమారన్ను చెప్పొచ్చు. తొలి చిత్రం ‘పొల్లాదవన్’తో మొదలుపెడితే ఆడుగళం, విసారణై, వడ చెన్నై అసురన్, విడుదల.. ఇలా వెట్రిమారన్ ప్రతి చిత్రం ఒక కళాఖండమే. దర్శకుడిగా మంచి పేరు వచ్చాక అతను నిర్మాతగా కూడా మారాడు.
గ్రాస్ రూట్ ఫిలిమ్ కంపెనీ సంస్థలో రెండంకెల సంఖ్యలో సినిమాలు నిర్మించాడు. ఈ సంస్థలో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్లే. అయినా సరే.. వెట్రిమారన్ తన ప్రొడక్షన్ హౌస్ను మూసేయాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిర్మాతగా ఒత్తిడిని తట్టుకోవడం కష్టంగా ఉందని.. అందుకే ప్రొడక్షన్ ఆపేస్తున్నానని అతను ప్రకటించాడు. వెట్రిమారన్ సంస్థ నుంచి రానున్న చివరి చిత్రం.. బ్యాడ్ గర్ల్. ఆ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కాబోతోంది.
వెట్రిమారన్ తన ప్రొడక్షన్లో కొన్ని రెవల్యూషనరీ ఫిలిమ్స్ నిర్మించాడు. వాటి వల్ల వివాదాలు తప్పలేదు. ముఖ్యంగా ఒక టీనేజీ అమ్మాయి రొమాంటిక్ ఫాంటసీల చుట్టూ తిరిగే ‘బ్యాడ్ గర్ల్’ ప్రోమోలు తీవ్ర విమర్శలకు దారి తీసి.. విడుదల బాగా ఆలస్యం అయింది. మరోవైపు ఆండ్రియా జెరెమీ ప్రధాన పాత్ర పోషించిన ‘మానుషి’ మరింత వివాదాస్పదమైంది. ఆ సినిమాపై యాంటీ నేషనల్ ముద్ర పడడంతో విడుదలకు అడ్డంకులు తప్పలేదు.
కోర్టు కేసుల్లో చిక్కుకున్న సెన్సార్ బోర్డు ఆ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ రెండు చిత్రాలూ వెట్రిమారన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఆర్థికంగా తలెత్తే ఇబ్బందులకు తోడు దర్శకుడిగా ఆయన చేసే సినిమాల మీద వీటి ప్రభావం పడుతోంది. అందుకే ఈ తలనొప్పులన్నీ ఎందుకు అని ఆయన తన నిర్మాణ సంస్థనే మూసేస్తున్నట్లు ప్రకటించాడు. త్వరలో శింబుతో వెట్రి ‘వడ చెన్నై’ తరహా రా అండ్ రస్టిక్ ఫిలిం తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 2, 2025 7:24 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…