తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకడు. తొలి చిత్రం ‘గమ్యం’తోనే తాను చాలా ప్రత్యేకమైన దర్శకుడినని ఆయన చాటారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి.. ఇలా ప్రతి సినిమాతోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ‘ఘాటి’తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘వేదం’ తీసిన దశాబ్దంన్నర తర్వాత ఆయన మళ్లీ అనుష్క ప్రధాన పాత్రలో సినిమా తీశారు.
నిజానికి స్వీటీతో ఆయన ఎప్పుడో రెండో సినిమా తీయాల్సిందట. ‘వేదం’ చిత్రానికి హైలైట్గా నిలిచిన సరోజ పాత్ర మీదే ప్రత్యేకంగా ఒక సినిమా చేయాలని క్రిష్ అనుకున్నాడట. ఆ సినిమా క్లైమాక్స్లో సరోజ పాత్ర ఆశగా ప్రపంచం వైపు చూసే షాట్ చూశాక ఆ పాత్ర మీద ఒక సినిమా తీయాలని తాను అనుకున్నట్లు క్రిష్ చెప్పాడు. అనుష్కకు కూడా సరోజ పాత్ర అంటే చాలా ఇష్టమని.. ఆమె కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించిందని.. ఐతే ఆ పాత్రను టచ్ చేస్తే పాడైపోతుందేమో అని దాని జోలికి వెళ్లలేదని క్రిష్ తెలిపాడు.
ఐతే సరోజ పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా ‘ఘాటి’లో శీలావతి పాత్ర ఉంటుందని.. ‘వేదం’ తర్వాత మళ్లీ అంత బలమైన కథతో ఈ సినిమా తీశానని క్రిష్ తెలిపాడు. ఈ చిత్రంలో అనుష్క పవర్ ఫుల్ పెర్ఫామెన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతారని క్రిష్ ధీమా వ్యక్తం చేశాడు. అనుష్క సినిమా బాగుంది అంటే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో గతంలో కొన్ని చిత్రాలు రుజువు చేశాయని.. ‘ఘాటి’ కూడా ఆమె స్టామినాను తెలియజేస్తుందని క్రిష్ అన్నాడు.
లీడ్ రోల్కు ‘శీలావతి’ అని పేరు పెట్టడం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చని.. కానీ అలా ఎందుకు పెట్టాం అన్నది సినిమా చూస్తే అర్థమవుతుందని క్రిష్ తెలిపాడు. ఈ సినిమాలో గంజాయిని గ్లోరిఫై చేయడం లాంటిదేమీ జరగలేదని.. దానికి వ్యతిరేకంగానే సినిమా ఉంటుందని క్రిష్ స్పష్టం చేశాడు.
This post was last modified on September 2, 2025 7:22 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…