చాప కింద నీరులా ఏఐ (కృత్రిమ మేధస్సు) మన జీవితంలోకి వచ్చేస్తోంది. రెండు రోజులు పట్టే పనిని కేవలం రెండు నిమిషాల్లో చేసే టెక్నాలజీని చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రమాదం, ప్రమోదం రెండూ మోసుకొస్తున్న దీని తీరుకి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అంచనా వేయలేకపోతున్నారు. ఏది ఒరిజినలో ఏది నకిలీనో గుర్తు పట్టలేక సామాన్యులు సతమతమవుతున్నారు. ఆచార్య, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి సినిమాల్లో హీరోలు యువకులుగా కనిపించిన వైనం చూసి ఆడియన్స్ షాక్ తిన్నారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ అదే చెబుతున్నాడు.
కూలీతో అంచనాలు అందుకోలేకపోయిన ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం విశ్వరూపంని ఓటిటి రిలీజ్ చేద్దామని కమల్ హాసన్ ప్రకటించినప్పుడు అందరూ వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు ఓటిటిలు లేకుండా సినిమాలు తీయలేని, రిలీజ్ చేయలేని పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చాడు. గతంలో అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సామాన్యం అయిపోయిందని వివరించాడు. విక్రమ్ లాంటి నటులు ఏఐలో చేస్తే ఆడియన్స్ చూస్తారా లేక నిజంగా కష్టపడితే థియేటర్లకు వస్తారా అంటూ ప్రశ్న సంధించి రాబోయే తరాలు చూడబోయే ఎక్స్ పీరియన్స్ ని ముందే హింట్ ఇస్తున్నాడు.
ప్రాథమిక దశలో ఉండగానే ఏఐ ఇంతగా ప్రభావం చూపిస్తోందంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు జరగబోతున్నాయో లోకేష్ కనగరాజ్ ముందస్తు సూచనలు చేస్తున్నాడు. తను చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. కూలీ ఫ్లాష్ బ్యాక్ లో రజనీకాంత్ కుర్రాడిగా కనిపించడం, చనిపోయిన విజయ్ కాంత్ గోట్ లో క్యామియో చేయడం ఇవన్నీ ఏఐ తాలూకు మాయాజాలాలే. వీటిని మరింత విస్తృతంగా వాడుకునేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఓ పది ఇరవై సంవత్సరాల తర్వాత అసలు ఆర్టిస్టులు నటించే అవసరమే లేకుండా కేవలం వాళ్ళను వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చి సినిమాలు తీసేస్తారేమో.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…