తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ విజయాలు అందుకుంటూ కెరీర్ను బాగానే ముందుకు తీసుకెళ్లాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ మధ్యలో ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్లో నటించడం తన కెరీర్కు పెద్ద డ్యామేజీ అయింది. ఆ సినిమా హిందీలో సరిగా ఆడలేదు. పైగా తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. ఈ విరామం తర్వాత ‘భైరవం’ చిత్రంలో నటిస్తే అది నిరాశపరిచింది. ఐతే తన కొత్త చిత్రం ‘కిష్కింధపురి’ మీద బెల్లంకొండ శ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ సినిమా తీసిన కౌశిక్ పెగల్లపాటి ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఇది డివైన్ ఎలిమెంట్స్తో ముడిపడ్డ ఫాంటసీ హార్రర్ మూవీ. దీని టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ‘రాక్షసుడు’ తర్వాత శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రమిది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 12న ‘కిష్కింధపురి’ రిలీజ్ కావాలి. ఐతే అదే రోజు ‘మిరాయ్’ భారీ అంచనాల మధ్య రిలీజవుతుండడంతో దానికి పోటీగా వెళ్లకపోవడం మంచిదే అన్న సందేహాలు కలిగాయి.
రిలీజ్ డేట్ మార్చక తప్పదని అనుకున్నారు. ఆ ప్రకారమే ‘కిష్కింధపురి’ వాయిదా పడింది. అలా అని వారం, రెండు వారాలేమీ పోస్ట్ పోన్ చేయలేదు. ఒక్క రోజు ఆలస్యంగా సెప్టెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 13న అన్నది హార్రర్ చిత్రాలకు సెంటిమెంటుగా కలిసొచ్చే డేట్. హార్రర్ చిత్రాల టైటిళ్లు కూడా ఈ నంబర్తో పెడుతుంటారు. ‘13 బి’ అందుకు ఉదాహరణ. ‘మిరాయ్’తో పోటీ మంచిది కాదని, సెంటిమెంటుగా కూడా కలిసొస్తుందని 13ను రిలీజ్ డేట్గా ఎంచుకున్నట్లున్నారు. 12న రావాాల్సిన మరో చిత్రం ‘కాంత’ ఆ వీకెండ్ నుంచి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ‘కిష్కింధపురి’కి సామ్ సీఎస్, చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందించగా.. షైన్ స్క్రీన్స్ అధినే సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశాడు.
This post was last modified on September 1, 2025 5:07 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…