గత కొన్నేళ్లలో అనుష్క శెట్టి సినిమాల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఆరేళ్ల వ్యవధిలో మూడు సినిమాలే చేసింది. 2020లో ‘నిశ్శబ్దం’తో పలకరించిన ఆమె.. రెండేళ్ల కిందట ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ‘ఘాటి’తో బాక్సాఫీస్ బరిలోకి నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనుష్క ఏ సినిమా చేస్తుంది అంటే సమాధానం లేదు. ఆమెకు కొత్త కమిట్మెంట్లు ఏవీ లేవు. అసలు తెలుగులో మళ్లీ ఇంకో సినిమా చేస్తుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఆమెను ఇక వెండితెరపై చూడలేం అనుకోవడానికేమీ లేదు.
బలమైన కంటెంట్తో సినిమాలు తీసే మలయాళ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెడుతుండడం విశేషం. అక్కడ ఓ భారీ చారిత్రక చిత్రంలో అనుష్క నటిస్తున్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా పేరు.. కథనార్. మలయాళంలో మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన జయసూర్య ‘కథనార్’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అతడికి డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతోంది. దీని కోసం రెండేళ్ల నుంచి శ్రమిస్తున్నాడు జయసూర్య.
ఇందులో అతడికి జోడీగా కల్లియకట్టు నీలి అనే పాత్రలో నటిస్తోంది. హీరో లాగే ఆమెది కూడా ఒక యోధురాలి పాత్రే. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత ఆమెకిది పవర్ ఫుల్ రోల్ అవుతుందని భావిస్తున్నారు. మలయాళంలో హీరోయిన్ల వయసు, గ్లామర్తో సంబంధం లేకుండా మంచి మంచి పాత్రలు ఇస్తుంటారు. అనుష్కకు ఈ సినిమా బ్రేక్ ఇస్తే.. ఆమెకు అక్కడ ఆల్టర్నేట్ కెరీర్ లభించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ మలయాళం సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతోంది కాబట్టి అనుష్కను మున్ముందు అక్కడి సినిమాల్లో రెగ్యులర్గా చూస్తే అది మంచి విషయమే అవుతుంది.
This post was last modified on September 1, 2025 5:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…