గత కొన్నేళ్లలో అనుష్క శెట్టి సినిమాల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఆరేళ్ల వ్యవధిలో మూడు సినిమాలే చేసింది. 2020లో ‘నిశ్శబ్దం’తో పలకరించిన ఆమె.. రెండేళ్ల కిందట ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ‘ఘాటి’తో బాక్సాఫీస్ బరిలోకి నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనుష్క ఏ సినిమా చేస్తుంది అంటే సమాధానం లేదు. ఆమెకు కొత్త కమిట్మెంట్లు ఏవీ లేవు. అసలు తెలుగులో మళ్లీ ఇంకో సినిమా చేస్తుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఆమెను ఇక వెండితెరపై చూడలేం అనుకోవడానికేమీ లేదు.
బలమైన కంటెంట్తో సినిమాలు తీసే మలయాళ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెడుతుండడం విశేషం. అక్కడ ఓ భారీ చారిత్రక చిత్రంలో అనుష్క నటిస్తున్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా పేరు.. కథనార్. మలయాళంలో మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన జయసూర్య ‘కథనార్’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అతడికి డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతోంది. దీని కోసం రెండేళ్ల నుంచి శ్రమిస్తున్నాడు జయసూర్య.
ఇందులో అతడికి జోడీగా కల్లియకట్టు నీలి అనే పాత్రలో నటిస్తోంది. హీరో లాగే ఆమెది కూడా ఒక యోధురాలి పాత్రే. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత ఆమెకిది పవర్ ఫుల్ రోల్ అవుతుందని భావిస్తున్నారు. మలయాళంలో హీరోయిన్ల వయసు, గ్లామర్తో సంబంధం లేకుండా మంచి మంచి పాత్రలు ఇస్తుంటారు. అనుష్కకు ఈ సినిమా బ్రేక్ ఇస్తే.. ఆమెకు అక్కడ ఆల్టర్నేట్ కెరీర్ లభించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ మలయాళం సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతోంది కాబట్టి అనుష్కను మున్ముందు అక్కడి సినిమాల్లో రెగ్యులర్గా చూస్తే అది మంచి విషయమే అవుతుంది.
This post was last modified on September 1, 2025 5:01 pm
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…
థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…
వైసీపీ అధినేత జగన్ వెనుక ఉండే కార్యకర్తలు, యువత అంతా `జెన్జీ` అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా…
బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…