గత కొన్నేళ్లలో అనుష్క శెట్టి సినిమాల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఆరేళ్ల వ్యవధిలో మూడు సినిమాలే చేసింది. 2020లో ‘నిశ్శబ్దం’తో పలకరించిన ఆమె.. రెండేళ్ల కిందట ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు ‘ఘాటి’తో బాక్సాఫీస్ బరిలోకి నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అనుష్క ఏ సినిమా చేస్తుంది అంటే సమాధానం లేదు. ఆమెకు కొత్త కమిట్మెంట్లు ఏవీ లేవు. అసలు తెలుగులో మళ్లీ ఇంకో సినిమా చేస్తుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఆమెను ఇక వెండితెరపై చూడలేం అనుకోవడానికేమీ లేదు.
బలమైన కంటెంట్తో సినిమాలు తీసే మలయాళ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెడుతుండడం విశేషం. అక్కడ ఓ భారీ చారిత్రక చిత్రంలో అనుష్క నటిస్తున్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా పేరు.. కథనార్. మలయాళంలో మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన జయసూర్య ‘కథనార్’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అతడికి డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతోంది. దీని కోసం రెండేళ్ల నుంచి శ్రమిస్తున్నాడు జయసూర్య.
ఇందులో అతడికి జోడీగా కల్లియకట్టు నీలి అనే పాత్రలో నటిస్తోంది. హీరో లాగే ఆమెది కూడా ఒక యోధురాలి పాత్రే. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత ఆమెకిది పవర్ ఫుల్ రోల్ అవుతుందని భావిస్తున్నారు. మలయాళంలో హీరోయిన్ల వయసు, గ్లామర్తో సంబంధం లేకుండా మంచి మంచి పాత్రలు ఇస్తుంటారు. అనుష్కకు ఈ సినిమా బ్రేక్ ఇస్తే.. ఆమెకు అక్కడ ఆల్టర్నేట్ కెరీర్ లభించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ మలయాళం సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతోంది కాబట్టి అనుష్కను మున్ముందు అక్కడి సినిమాల్లో రెగ్యులర్గా చూస్తే అది మంచి విషయమే అవుతుంది.
This post was last modified on September 1, 2025 5:01 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…