ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ‘కల్కి-2’ ఒకటి. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల క్రేజీ కాంబినేషన్లో నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి’ గత ఏడాది విడుదలై ఘనవిజయాన్నందుకుంది. ఆ కథను మధ్యలో ఆపడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా సెకండ్ పార్ట్ షూట్ గురించి ఏ అప్డేట్ లేదు. నాగ్ అశ్విన్ స్క్రిప్టు రెడీ చేసుకుని, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ఒక కొలిక్కి తెచ్చేశాడు కానీ.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఎదురు చూపులు తప్పడం లేదు.
మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నదానిపై అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీని గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పాడ్ కాస్ట్లో మాట్లాడాడు. ‘‘కల్కి-2 షూట్ చాలా అంశాలతో ముడిపడి ఉంది. ‘కల్కి’లోని ముఖ్య పాత్రధారులందరితో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. అందుకే వాళ్లందరికీ కుదిరినపుడే చిత్రీకరణ జరపాలి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు పార్ట్-1ను మించి ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.
అందుకే ‘కల్కి-2’ రిలీజ్ గురించి నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ‘కల్కి’ స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారు. కాబట్టి ఫలానా టైంలో షూట్ మొదలవుతుందని చెప్పడం కష్టం. ఐతే షూటింగ్కు తక్కువ సమయమే పట్టినా.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు చాలా టైం పడుతుంది. ఇంకో రెండేళ్ల వ్యవధిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని నాగి చెప్పాడు. ‘కల్కి’లో ప్రభాస్, కమల్ హాసన్ల పాత్రల పరిధి తక్కువ అని ప్రేక్షకులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. కానీ పార్ట్-2లో వీళ్ల పాత్రలు ఇంకా బలంగా, ఎక్కువ నిడివితో ఉంటాయని తెలుస్తోంది.
This post was last modified on September 1, 2025 4:48 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…