ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ‘కల్కి-2’ ఒకటి. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల క్రేజీ కాంబినేషన్లో నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి’ గత ఏడాది విడుదలై ఘనవిజయాన్నందుకుంది. ఆ కథను మధ్యలో ఆపడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా సెకండ్ పార్ట్ షూట్ గురించి ఏ అప్డేట్ లేదు. నాగ్ అశ్విన్ స్క్రిప్టు రెడీ చేసుకుని, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ఒక కొలిక్కి తెచ్చేశాడు కానీ.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఎదురు చూపులు తప్పడం లేదు.
మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నదానిపై అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీని గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పాడ్ కాస్ట్లో మాట్లాడాడు. ‘‘కల్కి-2 షూట్ చాలా అంశాలతో ముడిపడి ఉంది. ‘కల్కి’లోని ముఖ్య పాత్రధారులందరితో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. అందుకే వాళ్లందరికీ కుదిరినపుడే చిత్రీకరణ జరపాలి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు పార్ట్-1ను మించి ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.
అందుకే ‘కల్కి-2’ రిలీజ్ గురించి నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ‘కల్కి’ స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారు. కాబట్టి ఫలానా టైంలో షూట్ మొదలవుతుందని చెప్పడం కష్టం. ఐతే షూటింగ్కు తక్కువ సమయమే పట్టినా.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు చాలా టైం పడుతుంది. ఇంకో రెండేళ్ల వ్యవధిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని నాగి చెప్పాడు. ‘కల్కి’లో ప్రభాస్, కమల్ హాసన్ల పాత్రల పరిధి తక్కువ అని ప్రేక్షకులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. కానీ పార్ట్-2లో వీళ్ల పాత్రలు ఇంకా బలంగా, ఎక్కువ నిడివితో ఉంటాయని తెలుస్తోంది.
This post was last modified on September 1, 2025 4:48 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…