రుద్రమదేవి సినిమాలో లీడ్ రోల్ చేసిన అనుష్కను మించి.. ప్రత్యేక పాత్ర చేసిన అల్లు అర్జున్ ఎక్కువ హైలైట్ అయ్యాడు అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆ రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా షేర్ సాధించిందన్నా.. అనుష్క మార్కెట్ను మించి భారీగా బడ్జెట్ పెట్టిన గుణశేఖర్ సేఫ్ జోన్లోకి వచ్చాడన్నా.. అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
బన్నీ కనిపించిన ప్రతి సన్నివేశం, అతను పలికిన ప్రతి డైలాగ్ హైలైట్గా నిలిచాయి. బన్నీ ఫ్యాన్సునేకాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ తన పాత్ర ఆకట్టుకుని సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఐతే నిజానికి ఆ పాత్రను బన్నీ చేయాల్సింది కాదట. గుణశేఖర్ ఫస్ట్ ఛాయిస్ వేరొకరట. అతనెవరో కాదు.. తమిళ నటుడు విక్రమ్ ప్రభు. లెజెండరీ నటుడు శివాజీ మనవడు, ప్రభు కొడుకు అయిన విక్రమ్ ప్రభుకు.. తమిళంలో మంచి పేరే ఉంది.
తమిళంలో ‘కుంకి’ సహా పలు హిట్ చిత్రాల్లో నటించిన విక్రమ్ ప్రభును ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ అడిగాడట. కానీ అప్పటికి తనకు ఖాళీ లేకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయానని విక్రమ్ ప్రభు తెలిపాడు. విక్రమ్ ప్రస్తుతం అనుష్క సినిమా ‘ఘాటి’లో కీలక పాత్ర చేశాడు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తాను మిస్ అయిన గోన గన్నారెడ్డి పాత్ర గురించి చెప్పాడు విక్రమ్. ఐతే ఆ పాత్రను బన్నీ అద్భుతంగా చేశాడని.. కాబట్టి దాన్ని మిస్సయినందుకు బాధ లేదని విక్రమ్ తెలిపాడు.
విక్రమ్ ఆ పాత్ర చేస్తే తమిళంలో కలిసి వస్తుందని గుణశేఖర్ భావించి ఉండొచ్చు. కానీ తెలుగులో సినిమా అంచనాలను మించి ఆడిందంటే బన్నీ ఆ పాత్ర చేయడం వల్లే. ఆ క్యారెక్టర్ కోసం బన్నీ పారితోషకం కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఆ పాత్ర బన్నీకి మంచి పేరు తేవడంతో పాటు సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచి గుణశేఖర్ను నిలబెట్టింది. లేదంటే అతను బాగా ఇబ్బంది పడేవాడే.
This post was last modified on August 31, 2025 6:11 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…