నిర్మాణంలో ఉన్నప్పుడు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక మిరాయ్ మీద అంచనాలు మారిపోయాయి. హనుమాన్ రేంజ్ లో మరోసారి తేజ సజ్జ క్వాలిటీ అవుట్ ఫుట్ తో వస్తున్నట్టు జనాలకు అర్థమైపోయింది. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. సెప్టెంబర్ 12 విడుదల లాక్ చేసుకున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనీ ప్రత్యేక ఆకర్షణ. 1600కి పైగా సిజి షాట్స్ తో గొప్ప అనుభూతినిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. వారంలోపు వాటిని కొలిక్కి తెచ్చి సెన్సార్ పూర్తి చేయబోతున్నారు. తమిళ, హిందీ, మలయాళం, కన్నడలో పెద్ద సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
ఇక తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు 25 కోట్లకు డీల్స్ క్లోజ్ చేశారని ఇన్ సైడ్ టాక్. మిరాయ్ కున్న గ్రాండియర్ లుక్ చూస్తుంటే ఇది చాలా రీజనబుల్ రేట్. పాజిటివ్ టాక్ వస్తే మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాలు వస్తాయి. ఇక్కడ పని చేసేది తేజ సజ్జ మార్కెట్ కాదు. కంటెంట్ లో చూపించిన వైవిధ్యం సినిమాలోనూ ఉంటుందనే నమ్మకం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ట్రాక్ రికార్డు పరంగా బ్లాక్ బస్టర్లు లేనప్పటికీ మిరాయ్ ని అతను తీర్చి దిద్దుతున్న తీరు గురించి వస్తున్న అప్డేట్స్ అంచనాలు ఏర్పరుస్తూ వెళ్లాయి.
అత్యాశకు వెళ్లకుండా మిరాయ్ ని ఈ రేట్లకు ఇవ్వడం నిజమైతే ఒక రకంగా ఇతర సినిమాలకు రోల్ మోడల్ అవుతుంది. దీనికి తోడు టికెట్ రేట్ల పెంపుకి వెళ్లే ఆలోచన లేదని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెప్పడం ఎగ్జిబిటర్ల చెవిలో పాలు పోసినట్టు అయ్యింది. ఎందుకంటే చీటికీ మాటికీ ప్రతి సినిమాకి యాభై నుంచి నూటా యాభై రూపాయల దాకా పెంచుకుంటూ పోవడం యావరేజ్, ఫ్లాప్ సినిమాలను దారుణంగా దెబ్బ కొడుతోంది. నిర్మాతలు ఈ వాస్తవాన్ని విస్మరించి రివ్యూలు, ఆన్ లైన్ టాకుల మీద నెపం నెట్టేస్తున్నారు. హనుమాన్ సైతం రెగ్యులర్ రేట్లతోనే వందల కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని మర్చిపోకూడదు.
This post was last modified on August 30, 2025 2:43 pm
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…