నిర్మాణంలో ఉన్నప్పుడు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక మిరాయ్ మీద అంచనాలు మారిపోయాయి. హనుమాన్ రేంజ్ లో మరోసారి తేజ సజ్జ క్వాలిటీ అవుట్ ఫుట్ తో వస్తున్నట్టు జనాలకు అర్థమైపోయింది. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. సెప్టెంబర్ 12 విడుదల లాక్ చేసుకున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనీ ప్రత్యేక ఆకర్షణ. 1600కి పైగా సిజి షాట్స్ తో గొప్ప అనుభూతినిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. వారంలోపు వాటిని కొలిక్కి తెచ్చి సెన్సార్ పూర్తి చేయబోతున్నారు. తమిళ, హిందీ, మలయాళం, కన్నడలో పెద్ద సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
ఇక తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు 25 కోట్లకు డీల్స్ క్లోజ్ చేశారని ఇన్ సైడ్ టాక్. మిరాయ్ కున్న గ్రాండియర్ లుక్ చూస్తుంటే ఇది చాలా రీజనబుల్ రేట్. పాజిటివ్ టాక్ వస్తే మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాలు వస్తాయి. ఇక్కడ పని చేసేది తేజ సజ్జ మార్కెట్ కాదు. కంటెంట్ లో చూపించిన వైవిధ్యం సినిమాలోనూ ఉంటుందనే నమ్మకం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ట్రాక్ రికార్డు పరంగా బ్లాక్ బస్టర్లు లేనప్పటికీ మిరాయ్ ని అతను తీర్చి దిద్దుతున్న తీరు గురించి వస్తున్న అప్డేట్స్ అంచనాలు ఏర్పరుస్తూ వెళ్లాయి.
అత్యాశకు వెళ్లకుండా మిరాయ్ ని ఈ రేట్లకు ఇవ్వడం నిజమైతే ఒక రకంగా ఇతర సినిమాలకు రోల్ మోడల్ అవుతుంది. దీనికి తోడు టికెట్ రేట్ల పెంపుకి వెళ్లే ఆలోచన లేదని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెప్పడం ఎగ్జిబిటర్ల చెవిలో పాలు పోసినట్టు అయ్యింది. ఎందుకంటే చీటికీ మాటికీ ప్రతి సినిమాకి యాభై నుంచి నూటా యాభై రూపాయల దాకా పెంచుకుంటూ పోవడం యావరేజ్, ఫ్లాప్ సినిమాలను దారుణంగా దెబ్బ కొడుతోంది. నిర్మాతలు ఈ వాస్తవాన్ని విస్మరించి రివ్యూలు, ఆన్ లైన్ టాకుల మీద నెపం నెట్టేస్తున్నారు. హనుమాన్ సైతం రెగ్యులర్ రేట్లతోనే వందల కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని మర్చిపోకూడదు.
This post was last modified on August 30, 2025 2:43 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…