టాలీవుడ్ లో డెబ్యూ మూవీ దేవరతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన జాన్వీ కపూర్ కి హిందీలో మాత్రం ఆ స్థాయి సక్సెస్ దక్కక ఏళ్ళు గడిచిపోతున్నాయి. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలు ఎన్ని చేసినప్పటికీ అవేవి కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తాజాగా పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. చెన్నై ఎక్స్ ప్రెస్, టూ స్టేట్స్ లాంటి పాత సినిమాల ఛాయలున్నాయనే కామెంట్స్ వచ్చినప్పటికీ మ్యూజిక్ ప్లస్ కావడంతో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అవి నిలబడలేదు.
తీరా చూస్తే ఈ పరమ్ సుందరి పరేషాన్ చేసేలా ఉంది. తాతల కాలం నాటి పాయింట్ ఒకటి తీసుకుని దానికి ఏఐ, యాప్స్ అనే కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల సహనంతో ఫుట్ బాల్ ఆడేసుకున్నారు. పరమ్ అనే కుర్రాడు చేసిన స్టార్ట్ అప్ బిజినెస్ లన్నీ టపా కట్టేస్తాయి. విసుగెత్తిన తండ్రితో ఛాలెంజ్ చేసి జీవిత భాగస్వామిని ఆన్ లైన్ లో ఎంచుకునే ఒక యాప్ కనిపెడతాడు. దాని పనితనం చూపించడం కోసం కేరళ వెళ్లి అక్కడ స్టే హోమ్ నడిపే సుందరి ప్రేమలో పడతాడు. కానీ అప్పటికీ ఆ అమ్మాయికి కాబోయే భర్త వేరే ఉంటాడు. అప్పుడు, ఆ తర్వాత జరిగేది చిన్న పిల్లాడు సైతం ఈజీగా గుర్తు పట్టేస్తాడు.
రొటీన్ ట్రీట్ మెంట్, పండని కామెడీ, రిపీట్ అనిపించే కంటెంట్ తో పరమ్ సుందరి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళ కుట్టిగా జాన్వీ కపూర్ మంచి నటన కనబరిచినప్పటికీ అదంతా వృథాగా పోయింది. సిద్దార్థ్ మల్హోత్రా రెగ్యులర్ అనిపించే హీరో పాత్రలో అంతకంటే రొటీన్ గా కనిపించాడు. సచిన్ జిగర్ సంగీతం వీలైనంత కాపాడే ప్రయత్నం చేసినా వీక్ కంటెంట్ ముందు వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అసలు ఇంత అత్తెసరు కథల మీద నిర్మాతలు కోట్ల పెట్టుబడి ఎలా పెడుతున్నారో అంతు చిక్కదు. బాలీవుడ్ వదిలేసి ఇకపై పెద్ది నుంచి జాన్వీ కపూర్ ఇక్కడే తెలుగులో సెటిలైపోవడం ఉత్తమం.
This post was last modified on August 30, 2025 12:10 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…