టాలీవుడ్ లో డెబ్యూ మూవీ దేవరతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన జాన్వీ కపూర్ కి హిందీలో మాత్రం ఆ స్థాయి సక్సెస్ దక్కక ఏళ్ళు గడిచిపోతున్నాయి. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలు ఎన్ని చేసినప్పటికీ అవేవి కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తాజాగా పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. చెన్నై ఎక్స్ ప్రెస్, టూ స్టేట్స్ లాంటి పాత సినిమాల ఛాయలున్నాయనే కామెంట్స్ వచ్చినప్పటికీ మ్యూజిక్ ప్లస్ కావడంతో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అవి నిలబడలేదు.
తీరా చూస్తే ఈ పరమ్ సుందరి పరేషాన్ చేసేలా ఉంది. తాతల కాలం నాటి పాయింట్ ఒకటి తీసుకుని దానికి ఏఐ, యాప్స్ అనే కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల సహనంతో ఫుట్ బాల్ ఆడేసుకున్నారు. పరమ్ అనే కుర్రాడు చేసిన స్టార్ట్ అప్ బిజినెస్ లన్నీ టపా కట్టేస్తాయి. విసుగెత్తిన తండ్రితో ఛాలెంజ్ చేసి జీవిత భాగస్వామిని ఆన్ లైన్ లో ఎంచుకునే ఒక యాప్ కనిపెడతాడు. దాని పనితనం చూపించడం కోసం కేరళ వెళ్లి అక్కడ స్టే హోమ్ నడిపే సుందరి ప్రేమలో పడతాడు. కానీ అప్పటికీ ఆ అమ్మాయికి కాబోయే భర్త వేరే ఉంటాడు. అప్పుడు, ఆ తర్వాత జరిగేది చిన్న పిల్లాడు సైతం ఈజీగా గుర్తు పట్టేస్తాడు.
రొటీన్ ట్రీట్ మెంట్, పండని కామెడీ, రిపీట్ అనిపించే కంటెంట్ తో పరమ్ సుందరి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళ కుట్టిగా జాన్వీ కపూర్ మంచి నటన కనబరిచినప్పటికీ అదంతా వృథాగా పోయింది. సిద్దార్థ్ మల్హోత్రా రెగ్యులర్ అనిపించే హీరో పాత్రలో అంతకంటే రొటీన్ గా కనిపించాడు. సచిన్ జిగర్ సంగీతం వీలైనంత కాపాడే ప్రయత్నం చేసినా వీక్ కంటెంట్ ముందు వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అసలు ఇంత అత్తెసరు కథల మీద నిర్మాతలు కోట్ల పెట్టుబడి ఎలా పెడుతున్నారో అంతు చిక్కదు. బాలీవుడ్ వదిలేసి ఇకపై పెద్ది నుంచి జాన్వీ కపూర్ ఇక్కడే తెలుగులో సెటిలైపోవడం ఉత్తమం.
This post was last modified on August 30, 2025 12:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…