బంగారు గుడ్లు ఇచ్చే బాతుని అత్యాశతో చంపేసినట్టయ్యింది రీ రిలీజుల వ్యవహారం. అభిమానుల ఎమోషన్లను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో పదే పదే పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ హద్దు మీరుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మూడు రోజుల ముందే తమ్ముడుని తీసుకొచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. చాలా సెంటర్లలో కనీసం క్యూబ్ ఖర్చులు రావడం అనుమానమే. ఈ పరిస్థితి కారణం పట్టుమని రెండేళ్లు తిరక్కుండానే తమ్ముడుని మరోసారి ఇప్పుడున్న టికెట్ రేట్లకే అభిమానులకు చూపించాలనుకోవడం.
నాగార్జున రగడ పరిస్థితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమి లేదు. రీ రిలీజ్ మొదటిసారే అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ సైతం దీని మీద ఆసక్తి చూపించలేదు. రెండు మూడు యాక్షన్ బ్లాక్స్, మూడు పాటలు తప్ప యావరేజ్ కంటెంట్ ఉన్న రగడ మీద జనాల్లో పెద్దగా ఇంటరెస్ట్ లేదు. పైగా శివ 4కె దగ్గరలో ఉండగా ఇప్పుడు రగడని తేవడం నాగ్ అభిమానులను ఇష్టం లేదు. దీంతో థియేటర్లకు దూరంగా ఉండిపోయారు. అత్యధిక షోలు క్యాన్సిలయ్యాయని సమచారం. ఆ మధ్య చిరంజీవి బర్త్ డేకి వదిలిన స్టాలిన్ ఇదే సిచువేషన్ ని చూసింది. క్రాస్ రోడ్స్ సింగల్ స్క్రీన్లు మినహాయించి మిగిలిన చోట సోసోనే.
కొంత కాలం వీటికి బ్రేక్ ఇవ్వడం అవసరం. కొత్త సినిమాలకు జనం రావడం మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో అదే పనిగా పాత హిట్లను ఇలా అరిగిపోయే దాకా రుద్దడం ఎంత మాత్రం సేఫ్ కాదు. నెక్స్ట్ ప్రభాస్ పౌర్ణమి లైన్ లో ఉంది. ఇది కూడా అప్పట్లో ఫ్లాప్ మూవీనే. ఈ నెల రెండో వారంలో వచ్చిన అతడు సైతం ఎలాంటి అద్భుతాలు చేయలేదు. కాకపోతే ఇప్పుడు చూస్తున్న ఫ్లాపుల కంటే మెరుగ్గా ఆడింది అంతే. రెండేళ్లుగా ఉదృతంగా నడిచిన ఈ ట్రెండ్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకున్నట్టే. శివ కనక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ నమోదు చేయకపోతే వీటి కథ కంచికి జానాల ఆసక్తి ఇంటికి చేరుకుందని చెప్పొచ్చు.
This post was last modified on August 30, 2025 11:58 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…