యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల సంతానం రోషన్ కనకాల డెబ్యూ మూవీ బబుల్ గమ్ డిజాస్టర్ కావడంతో కుర్రాడు బాగానే గ్యాప్ తీసుకున్నాడు. త్వరలో మోగ్లీగా రాబోతున్నాడు. రామ్ చరణ్ తో టీజర్ లాంచ్ చేయించి జనాల దృష్టిలో పడేలా చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో బడ్జెట్ భారీగా పెట్టిన వైనం కనిపించింది. రెండు నిమిషాల వీడియోలో కథేంటో చెప్పేశారు. అడవిలో ఉండే కుర్రాడు డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె మీద ఒక పోలీస్ ఆఫీసర్ కన్ను పడుతుంది. దీంతో ఆ అబ్బాయి మీద దాడులు మొదలవుతాయి. అయితే మోగ్లీ అంత ఆషామాషీగా లోంగే రకం కాదు .
మోగ్లీ అసలు ఆకర్షణ దర్శకుడు సందీప్ రాజ్. కలర్ ఫోటో లాంటి జాతీయ అవార్డు సాధించిన సినిమా ఇచ్చాక చాలా విరామం తీసుకున్నాడు. మధ్యలో కథలు ఇవ్వడం, నటించడం చేశాడు కానీ డైరెక్షన్ కు మాత్రం ఎక్కువ టైం పట్టింది అయితే మోగ్లీ చాలా స్పెషల్ గా ఉంటాడని, బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నాడు. విజువల్స్ గట్రా చూస్తుంటే కంటెంట్ ఫ్రెష్ గా అనిపిస్తోంది. లైన్ పరంగా మరీ కొత్తదనం అనిపించకపోయినా నగరానికి నట్టడివికి ఎలా ముడిపెట్టారనే పాయింట్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు. పరాక్రమం దర్శకుడు బండి సరోజ్ ఇందులో విలన్ గా నటించడం విశేషం.
రోషన్ కు మోగ్లీ హిట్టు కావడం చాలా అవసరం. ఎందుకంటే దీంతో ప్రూవ్ చేసుకుంటే కెరీర్ కు బలమైన నాంది పడుతుంది. సుమ, రాజీవ్ కనకాల ఎంత సెలబ్రిటీలు అయినా వాళ్లకు థియేటర్ ఆడియన్స్ వచ్చేంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఏదైనా సరే రోషన్ స్వంతంగా సంపాదించుకోవాల్సిందే. కుర్రాడిలో టాలెంట్ ఉంది కాబట్టి దాన్ని వాడుకునే దర్శకుడు దొరకాలి. కలర్ ఫోటోతో సుహాస్ కు చాలా పెద్ద బ్రేక్ దొరికింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే దర్శకుడు తీస్తున్న మోగ్లీ కనక సక్సెస్ అయితే తనలాగే రోషన్ కనకాల మంచి ఇన్నింగ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.
This post was last modified on August 29, 2025 10:13 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…