హీరోలు కథలు వినడం ఓకె చేయడం వరకు బాగానే వుంటుంది. కానీ వన్స్ రెమ్యూనిరేషన్ దగ్గరకు వచ్చేసరికి హైడ్ అండ్ సీక్ వ్యవహారం మొదలవుతుంది. స్ట్రయిట్ గా హీరో చెప్పరు. స్ట్రయిట్ గా నిర్మత బేరాలు ఆడరు. మధ్యలో మేనేజర్లు కొంత వరకు వుంటారు. వీళ్లందరు కలిసి ఎవరి స్ట్రాటజీలు వారు వేస్తారు. అందులోనూ కాస్త సక్సెస్ రేట్ తక్కువ వున్న హీరో అయితే మరీనూ.
హీరో రవితేజ నిర్మాణ సంస్థ యువి ఇప్పుడు ఇలాగే చేస్తున్నాయని తెలుస్తోంది. డైరక్టర్ మారుతి చెప్పిన సబ్జెక్ట్ ను రవితేజ ఓకె చేసారు. వచ్చే ఏడాది ఆరంభంలో డేట్ లు ఇస్తా అన్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ రెమ్యూనిరేషన్ మాట్లాడాల్సింది నిర్మాతలు. ఈ సినిమాకు నిర్మాతలు బన్నీవాస్-యువి వంశీ. ఇప్పుడు యువి వంశీ ఫైనల్ చేయాలి.
ఇక్కడే హైడ్ అండ్ సీక్ గేమ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా విడుదల వరకు ఆగుదాం. సినిమా హిట్ అయితే మరి కాస్త డిమాండ్ చేయచ్చు అని హీరో వైపు నుంచి ఆలోచనగా వుంది. అదే ఆలోచన రివర్స్ లో వుంది యువి వైపు నుంచి. క్రాక్ సినిమా రిజల్ట్ బాగుంటే ఒకె. లేదూ అంటే కాస్త బేరం ఆడొచ్చు అన్నది యువి ఆలోచన.
కానీ మద్యలో సమస్య డైరక్టర్ మారుతిది. ఆయనకు మరో ఆప్షన్ లేదు. రవితేజ డేట్ లు కావాల్సింది. కానీ అలా అని నిర్మాతను గట్టిగా ఫోర్స్ చేయలేరు. అందుకే ఆయన కూడా సైలంట్. ఇలా ముగ్గురి మధ్య దాగుడుమూతలు జనవరి వరకు సాగాల్సిందే. క్రాక్ విడుదలయ్యేది అప్పుడే కదా?
This post was last modified on November 22, 2020 10:28 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…