ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెంగాలీ భామ కమలిని ముఖర్జీ.. ఆ చిత్రంతో ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు గోదావరి, గమ్యం.. ఇలా ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం అయ్యే తెలుగు సినిమాల్లో ఇన్ని గొప్ప పాత్రలు ఒక కథానాయిక చేయడం అరుదైన విషయం. ఐతే కొన్నేళ్ల పాటు తెలుగులో హవా సాగించిన కమలిని.. ఉన్నట్లుండి అంతర్ధానం అయిపోయింది. చాలా ఏళ్లుగా ఆమె టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీదే కనిపించలేదు.
కానీ అదే సమయంలో వేరే భాషా చిత్రాల్లో నటించింది. మరి అవకాశాలు రాక ఇక్కడ సినిమాలు చేయలేదా.. లేక ఆమే దూరమైందా అన్నది స్పష్టత లేదు. ఐతే ఒక ఇంటర్వ్యూలో కమలిని స్వయంగా ఈ సందేహాలకు సమాధానం ఇచ్చింది. ఒక సినిమాలో తాను చేసిన పాత్ర తాను ఊహించినంత బలంగా, లోతుగా తెరపైకి రాలేదని… ఆ క్యారెక్టర్ మిగిల్చిన నిరాశ, అసంతృప్తి వల్లే తాను తెలుగు సినిమాలకు దూరం అయ్యానని కమలిని చెప్పడం గమనార్హం. ఆ సినిమా ఏదన్నది ఆమె బయటపెట్టలేదు. చివరగా తెలుగులో కమలిని నటించిన సినిమా.. రామ్ చరణ్ హీరోగా సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన గోవిందుడు అందరివాడేలే.
ఈ చిత్రంలో శ్రీకాంత్ మరదలిగా కీలకమైన పాత్రలోనే నటించింది కమలిని. కానీ ఆ సినిమా అనుకున్నంత పెద్ద విజయం ఐతే సాధించలేదు కానీ, హిట్ అనే ముద్ర ఐతే వేసుకుంది. మరి కమలినికి అసంతృప్తి మిగిల్చిన సినిమా ఇదేనా.. లేక మరొకటా అన్నది ఆమెనే చెప్పాలి. దీని కంటే ముందు కమలినికి తెలుగులో ఫ్లాప్ మూవీస్ లేకపోలేదు. గోవిందుడు అందరివాడేలే తర్వాత ఆమె తమిళంలో ఇరైవి, మలయాళంలో పులి మురుగన్ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు విజయవంతం అయ్యాయి. కమలిని నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ ఆ తర్వాత ఆ భాషల్లో ఆమె సినిమాలు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on August 29, 2025 6:09 am
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…