ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెంగాలీ భామ కమలిని ముఖర్జీ.. ఆ చిత్రంతో ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు గోదావరి, గమ్యం.. ఇలా ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం అయ్యే తెలుగు సినిమాల్లో ఇన్ని గొప్ప పాత్రలు ఒక కథానాయిక చేయడం అరుదైన విషయం. ఐతే కొన్నేళ్ల పాటు తెలుగులో హవా సాగించిన కమలిని.. ఉన్నట్లుండి అంతర్ధానం అయిపోయింది. చాలా ఏళ్లుగా ఆమె టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీదే కనిపించలేదు.
కానీ అదే సమయంలో వేరే భాషా చిత్రాల్లో నటించింది. మరి అవకాశాలు రాక ఇక్కడ సినిమాలు చేయలేదా.. లేక ఆమే దూరమైందా అన్నది స్పష్టత లేదు. ఐతే ఒక ఇంటర్వ్యూలో కమలిని స్వయంగా ఈ సందేహాలకు సమాధానం ఇచ్చింది. ఒక సినిమాలో తాను చేసిన పాత్ర తాను ఊహించినంత బలంగా, లోతుగా తెరపైకి రాలేదని… ఆ క్యారెక్టర్ మిగిల్చిన నిరాశ, అసంతృప్తి వల్లే తాను తెలుగు సినిమాలకు దూరం అయ్యానని కమలిని చెప్పడం గమనార్హం. ఆ సినిమా ఏదన్నది ఆమె బయటపెట్టలేదు. చివరగా తెలుగులో కమలిని నటించిన సినిమా.. రామ్ చరణ్ హీరోగా సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన గోవిందుడు అందరివాడేలే.
ఈ చిత్రంలో శ్రీకాంత్ మరదలిగా కీలకమైన పాత్రలోనే నటించింది కమలిని. కానీ ఆ సినిమా అనుకున్నంత పెద్ద విజయం ఐతే సాధించలేదు కానీ, హిట్ అనే ముద్ర ఐతే వేసుకుంది. మరి కమలినికి అసంతృప్తి మిగిల్చిన సినిమా ఇదేనా.. లేక మరొకటా అన్నది ఆమెనే చెప్పాలి. దీని కంటే ముందు కమలినికి తెలుగులో ఫ్లాప్ మూవీస్ లేకపోలేదు. గోవిందుడు అందరివాడేలే తర్వాత ఆమె తమిళంలో ఇరైవి, మలయాళంలో పులి మురుగన్ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు విజయవంతం అయ్యాయి. కమలిని నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ ఆ తర్వాత ఆ భాషల్లో ఆమె సినిమాలు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on August 29, 2025 6:09 am
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…