Movie News

కుబేర తర్వాత… కమ్ముల మళ్లీ

కొందరు దర్శకులకు కొన్ని బేనర్లతో బాగా సింక్ కుదురుతుంది. గత చిత్రాల ప్రొడక్షన్ విషయంలో ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చు లేదంటే కొత్త నిర్మాతలతో కంఫర్ట్ ఉండొచ్చు. కారణమేదైనా వరుసగా ఒక బేనర్లో సినిమాలు చేస్తుంటారు. నిర్మాణ సంస్థలు కూడా తమకంటూ ఆస్థాన దర్శకులు ఉండాలని కోరుకుంటాయి. దిల్ రాజు బేనర్లో ఇలా వరుసగా సినిమాలు చేసిన దర్శకులు చాలామందే ఉన్నారు. హారిక హాసిని సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే సినిమాలు తీస్తోంది. త్రివిక్రమ్ కూడా బయటి బేనర్లకు సినిమాలే చేయట్లేదు. 

ఈ కోవలోనే శేఖర్ కమ్ముల కూడా ఒక సంస్థతో ట్రావెల్ చేస్తున్నాడు. అదే.. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పీ. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కలిసి నడిపిస్తున్న సంస్థ. ఈ బేనర్లో కమ్ముల ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తొలిసారి ఆ బేనర్లో చేసిన ‘లవ్ స్టోరి’ ఓ మోస్తరు ఫలితాన్నందుకోగా.. రెండో చిత్రం ‘కుబేర’ తెలుగు వరకు మంచి విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఈ నిర్మాణ సంస్థలో కమ్ముల సినిమా చేయబోతున్నాడు. 

వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని కమ్ములతో తమ బేనర్లో మరో సినిమా చేయబోతున్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఐతే ఇంతకుమించి సినిమా గురించి వివరాలేమీ వెల్లడించలేదు. ఈ ప్రాజెక్టు ఆరంభ దశలోనే ఉందని, కాస్ట్ అండ్ క్రూ గురించి తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. కమ్ముల స్క్రిప్టు రెడీ చేయడానికి, ప్రి ప్రొడక్షన్‌కు చాలా టైం తీసుకుంటాడు. కాబట్టి వచ్చే ఏడాదే ఈ సినిమా మొదలయ్యే అవకాశముంది. ఈసారి తన మార్కు ప్రేమకథా చిత్రం తీస్తానని ‘కుబేర’ ప్రమోషన్ల టైంలో కమ్ముల వెల్లడించిన సంగతి తెలిసిందే.

This post was last modified on August 28, 2025 8:11 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 minutes ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

28 minutes ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

5 hours ago