తేజ సజ్జ రొట్టె విరిగి నేతిలో పడేలా ఉంది. సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం ఇతర రాష్ట్రాల్లో బడా సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. హిందీ వెర్షన్ ధర్మ ప్రొడక్షన్స్ తరఫున కరణ్ జోహార్ తీసుకోగా, కర్ణాటకలో కెజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ రంగంలోకి దిగింది. తమిళనాడులో ఏజిఎస్ సినిమాస్ ముందుకు వచ్చిందంటే థియేటర్ల పరంగా వచ్చే అతి పెద్ద సమస్య తీరినట్టే. మలయాళంలో గోకులం అండదండలు దొరకడమంటే మాములు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల పంపిణీదారులు ఇంకో రెండు మూడు రోజుల్లో ఫైనల్ కాబోతున్నారు. మొత్తానికి ప్యాన్ ఇండియా స్కెచ్ పెద్దగానే ఉంది.
హనుమాన్ తర్వాత తేజ సజ్జ మిరాయ్ కోసమే రెండేళ్లు ఖర్చు పెట్టుకున్నాడు. మధ్యలో చాలా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. మార్కెట్ ని పెంచుకునే లక్ష్యంతో వయసుకి మించి కష్టపడ్డాడు. బజ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ డ్రామాలో బలమైన డివోషనల్ ఎలిమెంట్ ఉందట. టీజర్ లో శ్రీరాముడు ఉండొచ్చనే హింట్ ఇచ్చారు కాబట్టి ఆ కోణం కనక సరిగ్గా వర్కౌట్ అయితే ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. నిఖిల్ కార్తికేయ 2 అంత బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఇదే. మిరాయ్ లోనూ అలాంటి అంశాలు పుష్కలంగా ఉన్నాయట.
మిరాయ్ కి తొలి రెండు వారాలు కీలకం కాబోతున్నాయి. సెప్టెంబర్ 25 ఓజి వస్తుంది కాబట్టి ఆలోగానే తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత రాబట్టుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పారుతున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో ఓజికి అతి పెద్ద రిలీజ్ దక్కనుంది. ఒకవేళ మిరాయ్ కనక హనుమాన్ రేంజ్ టాక్ తెచ్చుకుంటే మూడో వారంలోనూ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 12 రావాల్సిన దుల్కర్ సల్మాన్ తప్పుకోవడం మిరాయ్ కి కలిసి వచ్చే అంశమే. అదే రోజు విజయ్ ఆంటోనీ భద్రకాళి ఉంది కానీ దాన్ని మరీ పెద్ద కాంపిటీషన్ గా భావించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. రేపు ట్రైలర్ తో అంచనాల లెక్కలు మారబోతున్నాయి.
This post was last modified on August 27, 2025 10:17 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…