చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా నారా రోహిత్ చేసిన సినిమా సుందరకాండ. నిజానికిది ఏడాది క్రితమే విడుదల కావాల్సింది. రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వినాయక చవితి పండక్కు మోక్షం దక్కించుకుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో హైదరాబాద్ లో ముందు రోజే ప్రీమియర్లు వేయడం టాక్ పరంగా పనికొచ్చింది. చూసినవాళ్లు బాగుందని, మంచి ప్రయత్నమని మెచ్చుకోవడం సోషల్ మీడియాలో కనిపించింది. మరీ హిలేరియస్ కాదు కానీ ఉన్నంతలో నవ్వించడానికి టీమ్ పెట్టిన ఎఫర్ట్ సక్సెసయ్యిందని మెచ్చుకున్నారు. భైరవం కన్నా బెటర్ రివ్యూలు సుందరకాండకు కనిపించాయి.
కానీ రోహిత్ ఆనందానికి వర్షం బ్రేక్ వేస్తోంది. తెలంగాణలో వర్షాలు భీకరంగా పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి నుంచి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల వైపు వాతావరణం వరదని మించి ఉంటోంది. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు థియేటర్ కు రావడం అంత సులభంగా ఉండదు. పైగా రోహిత్ కు మంచి టేస్ట్ ఉందనే అభిప్రాయం జనంలో ఉన్నా తనేమి ఓపెనింగ్స్ తీసుకొచ్చే క్రౌడ్ పుల్లర్ కాదు. బాగుందనే మాట మెల్లగా పాకితే జనం రావడం మొదలు పెడతారు. కానీ ఇప్పుడొచ్చిన డీసెంట్ టాక్ కలెక్షన్లుగా మారాలంటే వర్షాలు తెరిపినివ్వాలి.
ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు పడుతున్నాయి. వినాయక మండపాలు సైతం ఇబ్బందులు పడుతున్న వైనం టీవీలో చూస్తున్నాం. పండగ ప్లస్ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో బిజినెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్న సుందరకాండ బృందానికి వర్షాలు షాక్ ఇస్తున్నాయి. రేపో ఎల్లుండో తగ్గితే శని ఆదివారాలు మెరుగైన ఆక్యుపెన్సీలు చూడొచ్చు. ప్రేమకథల్లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకున్న దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి మొదటి ప్రయత్నంలో మంచి ప్రశంసలే అందుకున్నాడు. మరి అవి వసూళ్లుగా మారతాయో లేదో సోమవారానికి క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం.
This post was last modified on August 27, 2025 9:11 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…