పెద్ది విడుదల ఇంకా చాలా దూరంలో ఉంది కానీ అభిమానుల ఎదురు చూపులు మాత్రం మాములుగా లేవు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ చేసిన గాయం చిన్నది కాకపోవడంతో ఎప్పుడెప్పుడు విమర్శకులకు సమాధానం చెప్పాలాని వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సినిమాని తీర్చిదిద్దుతున్న విధానం గురించి ఇప్పటికే రకరకాల వార్తలు బయటికి వచ్చి వాళ్ళ ఎగ్జైట్ మెంట్ ని అమాంతం పెంచుతున్నాయి. రంగస్థలం టెన్ ఎక్స్ రేంజులో ఉంటుందని తెగ ఊరింపులు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన లీకు మాత్రం అంచనాలు మరింత పెంచేలా ఉంది.
వాటి ప్రకారం చరణ్ ఇందులో రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. వయసు రీత్యా పరస్పరం పూర్తి విరుద్ధంగా ఉంటాయట. అంటే డ్యూయల్ రోల్ అన్న మాట. గేమ్ ఛేంజర్ లో ఆల్రెడీ తండ్రి కొడుకులుగా నటించిన చరణ్ దాని రూపంలో చేదు ఫలితం అందుకున్నాడు. కానీ ఆ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు చరణ్ లు కనిపించలేదు. నాయక్ లో వివి వినాయక్ కవల చరణ్ కాంబో సీన్లు బోలెడు పెట్టి ఖుషి చేశాడు. మరి పెద్దిలో బుచ్చిబాబు ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. డ్యూయల్ రోల్ అయినా కాకపోయినా రెండు రూపాల్లో రామ్ చరణ్ విశ్వరూపం ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
మార్చి 27 విడుదలకు రెడీ అవుతున్న పెద్దికి ఎలాంటి ఆలస్యం జరగడం లేదు. తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో కీలకమైన ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. దీనికోసమే గెడ్డం మరింత గుబురుగా పెంచి హెయిర్ స్టైల్ మార్చాడనే కామెంట్స్ అంతర్గతంగా వినిపిస్తున్నాయి. డిసెంబర్ కంతా షూట్ పూర్తి చేసి జనవరి నుంచి పూర్తి ప్రమోషన్ల మీద దృష్టి పెట్టేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఉప్పెన చూసి తన మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న చరణ్ కి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు బుచ్చిబాబు. బిజినెస్ కు సంబంధించి నిర్మాతకు క్రేజీ ఆఫర్లు వస్తున్నా ఇంకా ఎవరి దగ్గరా అడ్వాన్స్ తీసుకోలేదట.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…