కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ చేయబోయే సినిమా దాని సీక్వెలే అని నిన్నా మొన్నటి దాకా ఉన్న ప్రచారం. అయితే ప్రభాస్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేకపోవడంతో పార్ట్ 2 మరింత ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిర్మాత అశ్వినిదత్ వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారు కానీ వరస ప్రాజెక్టులతో లాకైపోయిన ప్రభాస్ ఇప్పుడప్పుడే డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందని, డార్లింగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరిగి పోయాయట. కానీ వెయిటింగ్ కొనసాగుతోంది.
ఇటీవలే రజనీకాంత్ కు నాగ్ అశ్విన్ ఒక లైన్ చెప్పాడని, ఆయన సానుకూలంగా స్పందించారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. ఇంకా నిర్ధారణ కాకపోయినా\ గాసిప్ గట్టిగానే ఉంది. గతంలో బాబీ లాంటి దర్శకులు రజనిని లైన్ తో మెప్పించినా ఫుల్ వెర్షన్ తో ఓకే చేయించుకోలేకపోయారు. సో నాగ్ అశ్విన్ కు కూడా అంత తేలిక కాదు. గత ఏడాది ఏవిఎం సంస్థతో కొలాబరేషన్ ప్రకటించిన నాగ్ అశ్విన్ అది దేని గురించో ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. తన స్వీయ దర్శకత్వమా లేక నిర్మాణ భాగస్వామినా అనేది చెప్పలేదు. ఆ మధ్య ఓసారి అలియా భట్ ని కలిశాడనే టాక్ కూడా ముంబై మీడియాలో ఉంది.
ఇదంతా చూస్తుంటే నాగ్ అశ్విన్ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2 కోసం డిమాండ్ చేస్తున్నా దానికి ఎదురు చూపులు తప్పేలా లేవు. ఇప్పటిదాకా చేసింది మూడు సినిమాలే అయినా పరుగులు పెట్టకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న ఈ క్రియేటివ్ దర్శకుడు వీలైనంత త్వరగా కొత్త సినిమా మొదలుపెట్టాలి. సమస్యల్లా కల్కిని మించిన కాంబోని ఆశిస్తారు కాబట్టి దాన్ని అందుకోవడమే పెద్ద సవాల్. ప్రస్తుతానికి పజిల్ లాంటి ప్రశ్నలైతే మిగిలాయి కానీ సమాధానాలకు మాత్రం టైం పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on August 26, 2025 11:51 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…