Movie News

కల్కి దర్శకుడి అసలు ప్లాన్ ఏంటి

కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ చేయబోయే సినిమా దాని సీక్వెలే అని నిన్నా మొన్నటి దాకా ఉన్న ప్రచారం. అయితే ప్రభాస్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేకపోవడంతో పార్ట్ 2 మరింత ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిర్మాత అశ్వినిదత్ వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారు కానీ వరస ప్రాజెక్టులతో లాకైపోయిన ప్రభాస్ ఇప్పుడప్పుడే డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందని, డార్లింగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరిగి పోయాయట. కానీ వెయిటింగ్ కొనసాగుతోంది.

ఇటీవలే రజనీకాంత్ కు నాగ్ అశ్విన్ ఒక లైన్ చెప్పాడని, ఆయన సానుకూలంగా స్పందించారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. ఇంకా నిర్ధారణ కాకపోయినా\ గాసిప్ గట్టిగానే ఉంది. గతంలో బాబీ లాంటి దర్శకులు రజనిని లైన్ తో మెప్పించినా ఫుల్ వెర్షన్ తో ఓకే చేయించుకోలేకపోయారు. సో నాగ్ అశ్విన్ కు కూడా అంత తేలిక కాదు. గత ఏడాది ఏవిఎం సంస్థతో కొలాబరేషన్ ప్రకటించిన నాగ్ అశ్విన్ అది దేని గురించో ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. తన స్వీయ దర్శకత్వమా లేక నిర్మాణ భాగస్వామినా అనేది చెప్పలేదు. ఆ మధ్య ఓసారి అలియా భట్ ని కలిశాడనే టాక్ కూడా ముంబై మీడియాలో ఉంది.

ఇదంతా చూస్తుంటే నాగ్ అశ్విన్ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2 కోసం డిమాండ్ చేస్తున్నా దానికి ఎదురు చూపులు తప్పేలా లేవు. ఇప్పటిదాకా చేసింది మూడు సినిమాలే అయినా పరుగులు పెట్టకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న ఈ క్రియేటివ్ దర్శకుడు వీలైనంత త్వరగా కొత్త సినిమా మొదలుపెట్టాలి. సమస్యల్లా కల్కిని మించిన కాంబోని ఆశిస్తారు కాబట్టి దాన్ని అందుకోవడమే పెద్ద సవాల్. ప్రస్తుతానికి పజిల్ లాంటి ప్రశ్నలైతే మిగిలాయి కానీ సమాధానాలకు మాత్రం టైం పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago