కన్నడ స్టార్ హీరో దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం గత ఏడాది ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు. ఐతే ఆరు నెలలు తిరిగేసరికే అతను రెగ్యులర్ బెయిల్ మీద బయటికి వచ్చేశాడు. ఈ హత్య చేయించింది దర్శనే అని.. స్వయంగా అతనే రేణుకాస్వామిని హింసించాడని ఆధారాలున్నా… ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నా.. దర్శన్కు బెయిల్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇటీవల ఇదే విషయమై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. దర్శన్ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించడంతో అతను తిరిగి జైలుకు వెళ్లక తప్పలేదు. దీంతో దర్శన్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శన్ బెయిల్ మీద బయటికి వచ్చాక పెండింగ్లో ఉన్న డెవిల్ సినిమాను పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి ఉంది. అవి పూర్తి చేసి సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొనడానికి రెడీ అవుతుండగా.. దర్శన్ బెయిల్ రద్దయింది. దీంతో డెవిల్ సినిమా పరిస్థితి ఏంటా అని అంతా అనుకున్నారు.
ఐతే దర్శన్ అందుబాటులో లేకపోయినా ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి టీం రెడీ అయిపోయింది. డిసెంబరు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. దర్శన్ తిరిగి జైలుకు వెళ్లిన రోజు.. అతడి భార్య తన ట్విట్టర్ అకౌంట్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. దర్శన్ మళ్లీ తిరిగి వస్తాడని.. అంత వరకు ఈ హ్యాండిల్ బాధ్యతలు తనవే అని.. దర్శన్ సినిమాల అప్డేట్స్ కూడా దీన్నుంచే వస్తాయని పేర్కొంది.
ఆ హ్యాండిల్లోనే డెవిల్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. బెయిల్ రద్దుకు ముందు సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.. దర్శన్ ఇప్పుడిప్పుడే తిరిగి బయటికి వచ్చేలా కనిపించడం లేదు. అతను లేకుండానే డెవిల్ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి హీరో ప్రమోషన్లలో పాల్గొనకుండా సినిమాకు ఎలాంటి రీచ్ ఉంటుందో.. హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న హీరో సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. పునీత్ రాజ్ కుమార్ హీరోగా మిలన్ అనే బ్లాక్ బస్టర్ మూవీని డైరెక్ట్ చేసిన ప్రకాష్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on August 25, 2025 10:46 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…