గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్లో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. మహావతార నరసింహానే. ఇండియాలో పెద్దగా పాపులర్ కాని యానిమేషన్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందు వరకు ఇండియాలో ఓ యానిమేషన్ చిత్రం రాబట్టిన అత్యధిక వసూళ్లు రూ.56 కోట్లు మాత్రమే. అలాంటిది ఈ సినిమా దాని మీద ఐదారు రెట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్లడం అంటే మాటలు కాదు. ముందు వంద కోట్ల వసూళ్లు మైలురాయిని దాటేసరికే ఔరా అనుకున్నారు. కానీ తర్వాత 200 కోట్ల మైలురాయిని కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది.
అప్పటికే సినిమా రిలీజై మూడు వారాలు దాటిపోవడంతో ఇంతకుమించి లాంగ్ రన్ ఉండదు అనుకున్నారు. పైగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వార్-2, కూలీ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో మహావతార నరసింహ రన్ ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఆ వీకెండ్లో ఆ చిత్రానికి థియేటర్లు తగ్ఆయి కానీ.. ఆ రెండు చిత్రాలూ అనుకున్నుంత బాగా ఆడకపోవడంతో మళ్లీ ఈ యానిమేషన్ మూవీ బ్యాటింగ్ మొదలుపెట్టింది. తిరిగి ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు పెంచారు. నాలుగో వీకెండ్లో కూడా ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది.
ఆల్రెడీ రూ.250 కోట్ల మైలురాయిని దాటేసిన ఈ సినిమా అసాధ్యం అనుకున్న రూ.300 కోట్ల మైలురాయిని కూడా సుసాధ్యం చేసే దిశగా సాగుతోంది. ఈ వీకెండ్ అన్ని షోలూ అయ్యేసరికి ఈ మైల్స్టోన్కు అత్యంత చేరువగా వచ్చేలా ఉంది మహావతార నరసింహ. సోమవారం లేదా మంగళవారం ఆ మైలురాయిని కూడా టచ్ చేసే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఒక రీజనల్ యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అసామాన్యం. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రూ.170 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది ఇప్పటిదాకా. తెలుగులో కూడా ఈ సినిమా ఫుల్ రన్లో రూ.50 కోట్ల మేర వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు ఫస్ట్, సెకండ్ షోలు ఫుల్స్ పడుతున్నాయి.
This post was last modified on August 24, 2025 9:53 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…