గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్లో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. మహావతార నరసింహానే. ఇండియాలో పెద్దగా పాపులర్ కాని యానిమేషన్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందు వరకు ఇండియాలో ఓ యానిమేషన్ చిత్రం రాబట్టిన అత్యధిక వసూళ్లు రూ.56 కోట్లు మాత్రమే. అలాంటిది ఈ సినిమా దాని మీద ఐదారు రెట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్లడం అంటే మాటలు కాదు. ముందు వంద కోట్ల వసూళ్లు మైలురాయిని దాటేసరికే ఔరా అనుకున్నారు. కానీ తర్వాత 200 కోట్ల మైలురాయిని కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది.
అప్పటికే సినిమా రిలీజై మూడు వారాలు దాటిపోవడంతో ఇంతకుమించి లాంగ్ రన్ ఉండదు అనుకున్నారు. పైగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వార్-2, కూలీ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో మహావతార నరసింహ రన్ ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఆ వీకెండ్లో ఆ చిత్రానికి థియేటర్లు తగ్ఆయి కానీ.. ఆ రెండు చిత్రాలూ అనుకున్నుంత బాగా ఆడకపోవడంతో మళ్లీ ఈ యానిమేషన్ మూవీ బ్యాటింగ్ మొదలుపెట్టింది. తిరిగి ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు పెంచారు. నాలుగో వీకెండ్లో కూడా ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది.
ఆల్రెడీ రూ.250 కోట్ల మైలురాయిని దాటేసిన ఈ సినిమా అసాధ్యం అనుకున్న రూ.300 కోట్ల మైలురాయిని కూడా సుసాధ్యం చేసే దిశగా సాగుతోంది. ఈ వీకెండ్ అన్ని షోలూ అయ్యేసరికి ఈ మైల్స్టోన్కు అత్యంత చేరువగా వచ్చేలా ఉంది మహావతార నరసింహ. సోమవారం లేదా మంగళవారం ఆ మైలురాయిని కూడా టచ్ చేసే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఒక రీజనల్ యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అసామాన్యం. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రూ.170 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది ఇప్పటిదాకా. తెలుగులో కూడా ఈ సినిమా ఫుల్ రన్లో రూ.50 కోట్ల మేర వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు ఫస్ట్, సెకండ్ షోలు ఫుల్స్ పడుతున్నాయి.
This post was last modified on August 24, 2025 9:53 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…