విభిన్న కథలను ఎంచుకుంటాడని పేరున్న నారా రోహిత్ ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. హీరోగా పెద్గ మార్కెట్ లేకపోయినా తన టేస్ట్ మీద నమ్మకంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ లేకపోలేదు. భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాని ఫలితం నెగటివ్ గా రావడంతో ఇప్పుడు ఆశలన్నీ సుందరకాండ మీద పెట్టుకున్నాడు . ఆగస్ట్ 27 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ మొదటి హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది. పెళ్లి కానీ ప్రసాద్ తరహా క్యారెక్టర్ ని పోషించిన నారా రోహిత్ ఈసారి పూర్తి వినోదాన్ని పంచుతాడని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ఇక ఛాన్స్ విషయానికి వద్దాం.
ఈ వారంలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఎక్కువగా లేవు. రవితేజ మాస్ జాతర తప్పుకోవడంతో గ్రౌండ్ ఫ్రీ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందిన అర్జున్ చక్రవర్తి, త్రిబాణధారి బార్బరిక్, కన్యాకుమారి ఉన్నప్పటికీ నోటెడ్ ఆర్టిస్టులు ఉన్న మూవీగా అంతో ఇంతో బజ్ వచ్చే అవకాశం ఉన్నది సుందరకాండకు ఒకటే. మిగిలినవి పూర్తిగా టాక్ మీద ఆధారపడినవి. నారా రోహిత్ కనక ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన తెచ్చుకుంటే సెప్టెంబర్ 4 దాకా డీసెంట్ వసూళ్లతో బండి లాగించొచ్చు. అటుపై అనుష్క ఘాటీ, మౌళి లిటిల్ హార్ట్స్, శివ కార్తికేయన్ మదరాసి ఉంటాయి కాబట్టి రన్ కొనసాగించడం కష్టం.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న సుందరకాండకు లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద ఇంత స్పేస్ దొరకడం నారా రోహిత్ కు కలిసి వచ్చే అంశం. కాకపోతే దాన్ని వాడుకోవడం కీలకం. గత రెండు నెలలుగా థియేటర్లను ఊపేసిన సినిమాలు రాలేదు. హరిహర వీరమల్లు, వార్ 2, కూలీ అంచనాలను నీరుగార్చేశాయి. మహావతార్ నరసింహ లేకపోతే పరిస్థితి ఇంకా దీనంగా ఉండేది. సుందరకాండ ఏదో అద్భుతం చేయకపోయినా పర్వాలేదు కానీ బాగానే ఉందని మాట తెప్పించుకున్నా చాలు దానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ కి ఈజీగా రికవర్ అయిపోతుంది.
This post was last modified on August 23, 2025 6:20 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…