బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు మాధుర్ బండార్కర్. చాందిని బార్, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్ లాంటి సినిమాలతో అతను గొప్ప పేరే సంపాదించాడు. ఈ మూడు చిత్రాలకూ జాతీయ అవార్డులు రావడం విశేషం. సామాజిక సమస్యలు, మహిళలకు సంబంధించిన స్ఫూర్తిదాయ ఇతివృత్తాలతో సినిమాలు తీయడం మాధుర్ శైలి.
ఐతే ఒకప్పుడు ఆయన సినిమాలకు ప్రశంసలతో పాటు వసూళ్లూ ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో మాధుర్ సినిమాలేవీ సరిగా ఆడలేదు. అయినా సరే మాధుర్ ప్రయత్నాలు ఆపలేదు. సినిమాలు తీస్తూనే ఉన్నాడు. కొత్తగా ‘బాలీవుడ్ వైవ్స్’ పేరుతో ఓ సినిమా తీయాలని మాధుర్ అనుకున్నాడు. ఆ టైటిల్ను రిజిస్టర్ చేయించాడు కూడా. స్క్రిప్టు కూడా రెడీ అయింది. కానీ మాధుర్ను మోసం చేసి ఆ టైటిల్ను మరో రకంగా వాడేశాడని అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
కరణ్ తనను మోసం చేశాడంటూ మాధుర్ గోడు వెల్లబోసుకుంటున్నాడు. కరణ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆయనో పోస్టు కూడా పెట్టాడు. అపూర్వ మెహతాతో కలిసి కరణ్ జోహార్ నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ టైటిల్ తన దగ్గర కాపీ కొట్టిందే అని మాధుర్ ఆరోపిస్తున్నాడు.
తాను ‘బాలీవుడ్ వైవ్స్’ టైటిల్ను రిజిస్టర్ చేయించుకున్న సంగతి తెలిసి.. ఆ టైటిల్ తమకివ్వాలని కరణ్ అడిగాడని.. కానీ తాను ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించానని.. ఆ టైటిల్తోనే సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటుండగా.. తన టైటిల్ను కొంచెం మార్చి అనైతికంగా ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే టైటిల్తో వెబ్ సిరీస్ తీసేసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారని మాధుర్ ఆరోపించాడు. తన ప్రాజెక్టును తక్కువగా చూడొద్దని, దయచేసి వెబ్ సిరీస్ టైటిల్ మార్చాలని మాధుర్ కరణ్ను కోరాడు. దీనికి అతనెలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on November 22, 2020 9:37 am
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…