పవన్ కళ్యాణ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా అభిమానులు ఎదురు చూస్తున్న ఓజి విడుదలకు ఇంకో 32 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మాములుగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే డివివి ఎంటర్ టైన్మెంట్స్ హ్యాండిల్ హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం వాళ్ళను టెన్షన్ కు గురి చేస్తోంది. ప్రస్తుతానికి రిలీజ్ ప్లానింగ్ లో ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 25కి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. వినాయకచవితి పండగ సందర్భంగా ఆగస్ట్ 27 రెండో ఆడియో సింగల్ రానుంది. తమన్ కంపోజ్ చేసిన మెలోడీని మ్యూజిక్ లవర్స్ కి కానుకగా ఇవ్వబోతున్నారు.
అసలైన ఛాలెంజింగ్ టాస్క్ ఇక ముందుంది. అసలే భారీ అంచనాలు నెలకొన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. వార్ 2, కూలీ ఇచ్చిన షాకులు మామూలువి కాదు. ఒకటి బ్రేక్ ఈవెన్ అందుకోవడానికే అష్టకష్టాలు పడితే మరొకటి నష్టాలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ జోష్ తేవాల్సిన బాధ్యత ఓజి మీద ఉంది. అసలే హరిహర వీరమల్లు తాలూకు ఫ్రస్ట్రేషన్ ఫ్యాన్స్ లో పచ్చిగానే ఉంది. దాన్ని తొలగించాలి. తీసింది రెండు సినిమాలే అయినా దర్శకుడు సుజిత్ మీద రాజమౌళి రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. గతంలో తనిచ్చిన హైప్ కూడా అదే స్థాయిలో ఉంది.
ఇక అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు విడుదలకు వారం ముందు మాత్రమే ట్రైలర్ లాంచ్ ఉండొచ్చని అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. డబ్బింగ్ కి టైం దొరకడమే ఎక్కువనేలా ఉంది పరిస్థితి. వీరమల్లుకు ఇచ్చినంత సమయం దీనికి కేటాయించడం అనుమానంగానే ఉంది. అయినా సరే హైప్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. కంటెంట్ బాగుండి అంచనాలు అందుకుంటే మాత్రం ఓజి రికార్డులకు ఆకాశమే హద్దుగా మారనుంది. చూడాలి ఏం చేస్తారో.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…