పవన్ కళ్యాణ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా అభిమానులు ఎదురు చూస్తున్న ఓజి విడుదలకు ఇంకో 32 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మాములుగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే డివివి ఎంటర్ టైన్మెంట్స్ హ్యాండిల్ హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం వాళ్ళను టెన్షన్ కు గురి చేస్తోంది. ప్రస్తుతానికి రిలీజ్ ప్లానింగ్ లో ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 25కి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. వినాయకచవితి పండగ సందర్భంగా ఆగస్ట్ 27 రెండో ఆడియో సింగల్ రానుంది. తమన్ కంపోజ్ చేసిన మెలోడీని మ్యూజిక్ లవర్స్ కి కానుకగా ఇవ్వబోతున్నారు.
అసలైన ఛాలెంజింగ్ టాస్క్ ఇక ముందుంది. అసలే భారీ అంచనాలు నెలకొన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. వార్ 2, కూలీ ఇచ్చిన షాకులు మామూలువి కాదు. ఒకటి బ్రేక్ ఈవెన్ అందుకోవడానికే అష్టకష్టాలు పడితే మరొకటి నష్టాలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ జోష్ తేవాల్సిన బాధ్యత ఓజి మీద ఉంది. అసలే హరిహర వీరమల్లు తాలూకు ఫ్రస్ట్రేషన్ ఫ్యాన్స్ లో పచ్చిగానే ఉంది. దాన్ని తొలగించాలి. తీసింది రెండు సినిమాలే అయినా దర్శకుడు సుజిత్ మీద రాజమౌళి రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. గతంలో తనిచ్చిన హైప్ కూడా అదే స్థాయిలో ఉంది.
ఇక అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు విడుదలకు వారం ముందు మాత్రమే ట్రైలర్ లాంచ్ ఉండొచ్చని అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. డబ్బింగ్ కి టైం దొరకడమే ఎక్కువనేలా ఉంది పరిస్థితి. వీరమల్లుకు ఇచ్చినంత సమయం దీనికి కేటాయించడం అనుమానంగానే ఉంది. అయినా సరే హైప్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. కంటెంట్ బాగుండి అంచనాలు అందుకుంటే మాత్రం ఓజి రికార్డులకు ఆకాశమే హద్దుగా మారనుంది. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on August 23, 2025 1:27 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…