మామూలుగా కంగనా రనౌత్తో పెట్టుకోవడానికి బాలీవుడ్ బిగ్ షాట్లే చాలా భయపడుతుంటారు. ఐతే ఆమెతో కయ్యానికి సై అంటున్నాడు మన వివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఈ కయ్యం ఏదైనా ఇష్యూ మీదేమో అనుకోకండి. వర్మ సై అంటున్నది బాక్సాఫీస్ వార్కు. కంగనా జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆ సినిమాకు పోటీగా తన ‘శశికళ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ జీవితం ఆధారంగా వర్మ ఎప్పుడో సినిమా ప్రకటించాడు. మధ్యలో దాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సినిమా మేకింగ్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఇంతకుముందు వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పూర్తవుతుందని.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, సరిగ్గా కంగనా సినిమా ‘తలైవి’ విడుదలయ్యే రోజే ‘శశికళ’ను రిలీజ్ చేస్తామని వర్మ ప్రకటించాడు.
‘తలైవి’లో జయలలిత మాత్రమే ఉంటుందని.. శశికళ పాత్రకు చోటుండదని.. కానీ తన సినిమాలో శశికళతో పాటు జయలలితకూ చోటుంటుందని.. అలాగే పన్నీర్ సెల్వం, పళని స్వామిల పాత్రలూ ఇందులో ఉంటాయని.. కాబట్టి తన సినిమానే ఎగ్జైటింగ్గా ఉంటుందని వర్మ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ‘తలైవి’ టీంను గిల్లుతూ కొన్ని ట్వీట్లు వేసి ‘శశికళ’ సినిమా గురించి అప్ డేట్స్ ఇచ్చాడు. ఐతే వర్మ సినిమా అంటే జనాలు మరీ లైట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో ‘తలైవి’ టీం పెద్దగా కంగారు పడాల్సిన అవసరమైతే ఉండదేమో.
This post was last modified on November 22, 2020 9:24 am
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…