మామూలుగా కంగనా రనౌత్తో పెట్టుకోవడానికి బాలీవుడ్ బిగ్ షాట్లే చాలా భయపడుతుంటారు. ఐతే ఆమెతో కయ్యానికి సై అంటున్నాడు మన వివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఈ కయ్యం ఏదైనా ఇష్యూ మీదేమో అనుకోకండి. వర్మ సై అంటున్నది బాక్సాఫీస్ వార్కు. కంగనా జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆ సినిమాకు పోటీగా తన ‘శశికళ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ జీవితం ఆధారంగా వర్మ ఎప్పుడో సినిమా ప్రకటించాడు. మధ్యలో దాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సినిమా మేకింగ్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఇంతకుముందు వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పూర్తవుతుందని.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, సరిగ్గా కంగనా సినిమా ‘తలైవి’ విడుదలయ్యే రోజే ‘శశికళ’ను రిలీజ్ చేస్తామని వర్మ ప్రకటించాడు.
‘తలైవి’లో జయలలిత మాత్రమే ఉంటుందని.. శశికళ పాత్రకు చోటుండదని.. కానీ తన సినిమాలో శశికళతో పాటు జయలలితకూ చోటుంటుందని.. అలాగే పన్నీర్ సెల్వం, పళని స్వామిల పాత్రలూ ఇందులో ఉంటాయని.. కాబట్టి తన సినిమానే ఎగ్జైటింగ్గా ఉంటుందని వర్మ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ‘తలైవి’ టీంను గిల్లుతూ కొన్ని ట్వీట్లు వేసి ‘శశికళ’ సినిమా గురించి అప్ డేట్స్ ఇచ్చాడు. ఐతే వర్మ సినిమా అంటే జనాలు మరీ లైట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో ‘తలైవి’ టీం పెద్దగా కంగారు పడాల్సిన అవసరమైతే ఉండదేమో.
This post was last modified on November 22, 2020 9:24 am
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…