టాలీవుడ్న గత మూడు వారాలుగా కార్మికుల సమ్మె కుదిపేసింది. జీతాల పెంపు కోసం ఫిలిం ఫెడరేషన్ ఇన్ని రోజుల పాటు స్ట్రైక్ చేయడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. దీంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయి నిర్మాతలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తప్పలేదు. మధ్యలో చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపించాయి. కానీ మళ్లీ ప్రతిష్టంభన తప్పలేదు. ఐతే ఎట్టకేలకు సమ్మె ఆగింది. చిత్రీకరణలు శుక్రవారం నుంచే పున:ప్రారంభం అవుతున్నాయి. మరి సమ్మె ఆగేలా చేయడానికి కుదిరిన రాజీ ఒప్పందం ఏంటి అన్నది ఆసక్తికరం.
ఇంతకుముందు నిర్మాతలు ప్రతిపాదించిన జీతాల పెంపుకి అంగీకరించని కార్మికులు.. స్వల్ప మార్పులతో ఇప్పుడు సరే అన్నారు. రాజీ ఒప్పందం ప్రకారం జీతాల పెంపు ఎలా ఉండబోతోందంటే.. తమకు 30 శాతం మేర జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా.. అలా కాకుండా 22.5 శాతం, అది కూడా దశల వారీగా జీతాలు పెంచేలా ఒప్పందం కుదిరింది.
రోజుకు రూ.2 వేల లోపు జీతాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉండబోతోంది. రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల ఆదాయం ఉన్న వారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం జీతాలు పెంచనున్నారు. సమ్మె ఆరంభమైన తొలి వారంలోనే నిర్మాతలు ఇలా దశల వారీగా జీతాల పెంచేందుకు ఒక ప్రతిపాదన చేశారు. కానీ అందుకు కార్మికులు అంగీకరించలేదు. అందరికీ ఏకమొత్తంగా వాళ్లు ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువ జీతాలు కావాలని కోరారు. ఐతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవడం.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాజీ ఒప్పందం కుదిరింది.
This post was last modified on August 22, 2025 11:57 am
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…