Movie News

సర్కారు వారి పాట.. ఇప్పుడే కాదు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ పేరుతో కొత్త సినిమా కొన్ని నెలల కిందటే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకే పరిమితం అయిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

సినిమా ఖరారై చాన్నాళ్లయినా.. ప్రారంభోత్సవానికి బాగా టైం పట్టేసింది. ఈ శనివారమే ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. హీరోతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు. మహేష్ భార్య నమ్రత, కూతురు సితార కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించడం విశేషం. దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పేట’ కీ టెక్నీషియన్ల వివరాలు వెల్లడించారు. అలాగే సినిమా షూటింగ్ కూడా గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు.

ముందు అనుకున్నట్లే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నాడు. మహేష్ బాబును ‘శ్రీమంతుడు’ సినిమాలో చాలా బాగా చూపించాడని పేరు తెచ్చుకున్న స్టార్ సినిమాటోగ్రాఫర్ మది ఈ చిత్రానికి పని చేయబోతున్నాడు. ఎస్.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కాగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటర్. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ కంపోజ్ చేయనున్నారు. ఇక ‘సర్కారు వారి పేట’ షూటింగ్ ముందు అనుకున్నట్లు ఇంకొన్ని రోజుల్లో ఏమీ మొదలు కావట్లేదు. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతామని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే మహేష్ చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడని.. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమాను మొదలుపెట్టేస్తాడని అన్నారు. ఇటీవలే కుటుంబంతో వెకేషన్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయడని అనుకున్నారు. కానీ మహేష్ ఇంకో నెలన్నర పైగానే విరామం తీసుకోబోతున్నాడని స్పష్టమవుతోంది. మరి కరోనాకు భయపడుతున్నాడా.. ఇంకేదైనా ఆలస్యానికి కారణముందా అన్నది తెలియదు.

This post was last modified on November 21, 2020 9:31 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

25 minutes ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

3 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

6 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

6 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

7 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

8 hours ago